కింగ్ నాగార్జున, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మూవీ రావాల్సి ఉంది. కానీ ఆ స్టార్ డైరెక్టర్ వల్ల మిస్ అయ్యింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ దర్శకుడు ఎవరనేది చూస్తే.
నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్లో మిస్ అయిన మూవీ
నాగార్జున చాలా మంది దర్శకులతో పనిచేశారు. ఎంతో మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దర్శకులు, హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు ఇలా చాలా మందికి లైఫ్ ఇచ్చారు. అయితే కొంత మంది దర్శకులతో మాత్రం ఆయన పనిచేయలేదు. స్టార్ డైరెక్టర్లతోనూ వర్క్ చేయలేకపోయారు. అలా త్రివిక్రమ్తోనూ పనిచేయలేదు నాగ్. కాకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మిస్ అయ్యింది. నిజానికి త్రివిక్రమ్ని పరిచయం చేయాల్సింది కూడా నాగార్జుననే. కానీ మరో స్టార్ డైరెక్టర్ వల్ల అది సెట్ కాలేదు.
25
రైటర్గా కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్
త్రివిక్రమ్ శ్రీనివాస్.. రైటర్గా కెరీర్ని ప్రారంభించారు. చాలా స్ట్రగుల్ అయిన ఆయన `స్వయంవరం` చిత్రంతో వెండితెరకు రైటర్గా పరిచయం అయ్యారు. ఓ రకంగా త్రివిక్రమ్కి దర్శకుడు విజయ్ భాస్కర్ లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు. వరుసగా ఆయన సినిమాలకు పనిచేశారు మాటల మాంత్రికుడు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ కథలతోనే ఎక్కువగా సినిమాలు చేశారు విజయ్ భాస్కర్. వీరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించాయి.
ఈ క్రమంలో అప్పటి వరకు రైటర్గానే ఉన్న త్రివిక్రమ్ దర్శకుడిగా మారాలనుకున్నారు. ఆయన వద్ద రెండు కథలున్నాయి. దర్శకుడు విజయ్ భాస్కర్ నెక్ట్స్ ఏం సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ రెండు కథలు చెప్పారు. అయితే వీటిని తానే దర్శకుడిగా చేయాలనుకున్నారు త్రివిక్రమ్. నెమ్మదిగా తన మనసులో మాటని వ్యక్తం చేశారు. దర్శకుడిగా మారి సినిమా చేయాలనుకుంటున్న అని చెప్పడంతో విజయ భాస్కర్ కూడా ఓకే చెప్పారట.
నాగార్జునతో చేయాల్సిన మన్మథుడు త్రివిక్రమ్ కి మిస్
అయితే మన్మథుడు కథని తాను చేయాలనుకున్నాడట త్రివిక్రమ్. దాన్ని నాగార్జునతో చేశారు. ఈ కథకి నాగార్జున సెట్ అవుతారని చెప్పి విజయ్ భాస్కర్ చెప్పడంతో ఆయన్ని కలిసి కథ వినిపించారు. నాగ్ కూడా వెంటనే ఓకే చెప్పారు. అయితే త్రివిక్రమ్ తన తొలి సినిమానే అంత పెద్ద హీరోని డీల్ చేయడం కష్టమని భావించారు. ఈ క్రమంలో మరో కథని తరుణ్తో చేయాలనుకున్నారు. ఆ సినిమాని త్రివిక్రమ్ చేయమని చెప్పాడట విజయ్ భాస్కర్. అలా తరుణ్తో త్రివిక్రమ్ సినిమా చేశారు. అలా నాగార్జునతో సినిమా మిస్ అయ్యింది. మళ్లీ వీరిద్దరు ఎప్పుడూ కలిసి పనిచేయలేదు.
55
నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్
తరుణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రమే `నువ్వే నువ్వే`. ఇది పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడిగా త్రివిక్రమ్ని నిలబెట్టింది. ఇందులో తరుణ్కి జోడీగా శ్రియా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. 2002లో విడుదలై ఆకట్టుకుంది. ఈ మూవీ త్రివిక్రమ్కి లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత మూడేళ్లకి మహేష్ బాబుతో `అతడు` సినిమా చేశాడు త్రివిక్రమ్. `జల్సా`, `ఖలేజా`, `జులాయి`, `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అ ఆ`, `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో`, `గుంటూరు టాకీస్` వంటి చిత్రాలు చేశారు. స్టార్ డైరెక్టర్గా రాణిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్తో తొలిసారి వర్క్ చేస్తూ `ఆదర్శకుటుంబం` అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.