బాలయ్య, కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి `అశ్వమేథం`. 1992లో విడుదలైన ఈ చిత్రంలో మీనా, నగ్మా హీరోయిన్లుగా నటించగా, సోగ్గాడు శోభన్ బాబు ముఖ్య పాత్ర పోషించాడు.
అశ్వినీదత్ నిర్మించారు. అప్పట్లో భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఓపెనింగ్లో చిరంజీవితోపాటు నాగార్జున కూడా గెస్ట్ లుగా పాల్గొన్నారు.
జూన్ 25న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై పాటని చిత్రీకరించగా, చిరంజీవి క్లాప్ నిచ్చారు. నాగార్జున కెమెరా స్విచ్చాన్ చేశారు.