ఇక వరుడు కావలెను మూవీ కథ విషయానికి వస్తే.... దుబాయ్ లో ఆర్కిటెక్ గా పనిచేసే ఎన్నారై ఆకాష్(Naga shaurya) ఓ ప్రాజెక్ట్ పనిపై ఇండియా వస్తాడు. ఆ క్రమంలో మేనేజర్ గా పనిచేస్తున్న భూమి(రీతూ వర్మ)ని కలుస్తాడు. మొదటి చూపులోనే భూమి ప్రేమలో పడిపోయిన ఆకాష్ ఆమెను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెళ్లి, ప్రేమ వ్యవహారాలు నచ్చని మొండిపిల్ల అయిన భూమి, ఆకాష్ ని దూరం పెడుతూ ఉంటుంది. అయితే ఆకాష్ పట్ల ఆమెకు ప్రేమ మొదలయ్యాక ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుని, దూరం పెరుగుతుంది... చివరికి భూమి, ఆకాష్ ప్రేమ సక్సెస్ అయ్యిందా? ఈ యువ జంట కహానీ ఎలా ముగిసింది అనేది మిగతా కథ.