ఫోటోలు దిగే క్రమంలో నాగ చైతన్య నీవు ఒక్కదానివే దిగని ఆమెకు సూచించాడు. శోభిత బ్రతిమిలాడే ప్రయత్నం చేసింది. కానీ నాగ చైతన్య నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే అక్కడి మీడియా జంటగా అలాగే, సింగిల్ గా సెలెబ్స్ ఫోటోలు తీస్తారు. ఫోటోగ్రాఫర్స్ డిమాండ్ మేరకు నాగ చైతన్య శోభితను సింగిల్ గా ఫోటోలు దిగమన్నారని తెలుస్తుంది.
ఇక నాగ చైతన్య తండేల్ మూవీతో బిజీ. దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు. అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.