ఎయిర్ పోర్ట్ కి వెళ్లి అమీర్ ఖాన్ ని రిసీవ్ చేసుకున్న నాగచైతన్య.. చిరంజీవితో కలిసి..

First Published Sep 19, 2021, 6:07 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.  అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా అమీర్ ఖాన్ పాల్గొననున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.  అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా అమీర్ ఖాన్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమిర్ ఖాన్ బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కాగా ఆయన్ని రిసీవ్ చేసుకునేందుకు లవ్ స్టోరీ చిత్ర నిర్మాతలు, నాగ చైతన్య ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు. 

విమానాశ్రయంలో అమీర్ ఖాన్ కు ఘనస్వాగతం లభించింది.  అనంతరం అమీర్ ఖాన్, నాగ చైతన్య కలసి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అమీర్, చైతు ఇద్దరూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ సంతోష్ కుమార్ ని అభినందించారు. 

మనం ఎన్నో ఛాలెంజ్ లు చూశాం. కానీ మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ని చేప్పట్టిన సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భావితరాలకు మంచి చేయాలంటే దీనిని ఒక కార్యక్రమంలా కాకుండా భద్యతగా అందరూ పాటించాలి అని అమీర్ ఖాన్ అన్నారు. 

ఇక లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అమీర్ ఖాన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇద్దరు లెజెండ్స్ వేదిక పంచుకోనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. పలుమార్లు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 24న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదిలా ఉండగా నాగ చైతన్య, అమీర్ ఖాన్ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఎందుకంటే అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య కీలక పాత్రలో ఆర్మీ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వీరిద్దరూ స్నేహితులుగా కనిపిస్తారు. ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. 

click me!