తాజా సమాచారం ప్రకారం, ఈ స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ ఏరికోరి బాలీవుడ్ నటి మౌనీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవితో కలిసి ఈ ప్రత్యేక పాటలో నటించినందుకు మౌనీ రాయ్ చాలా తక్కవు పారితోషికం తీసుకుందట. హిందీ టెలివిజన్ సీరియల్ నాగినీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన మౌనీ రాయ్, బ్రహ్మాస్త్రం వంటి సినిమాలతో ఫేమస్ అయ్యింది. అంతే కాదు కన్నడ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లో స్పెషల్ సాంగ్ చేసి సౌత్ ఆడియన్స్ కు కూడా చాలా దగ్గరయ్యింది.