
సినిమా సెలబ్రిటీలకు కాలంతో సంబంధం లేకుండా ఆదరణ ఉంటుంది. వారి సినిమాల సమయంలో ఆ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్ బయటకు వచ్చింది. డిసెంబర్లో ఎవరు టాప్లో ఉన్నారు? ఎవరు చివర్లో ఉన్నారు అనేది టాప్ 10 హీరోయిన్ల జాబితాని విడుదల చేసి ఓర్మాక్స్ మీడియా. ఇది ప్రతి నెల ఇండియా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితా విడుదల చేస్తుంది. డిసెంబర్ లిస్ట్ వచ్చింది. మరి ఇండియా వైడ్గా మోస్ట్ పాపులర్ హీరోయిన్లు ఎవరో చూద్దాం.
ఇందులో టాప్ 1లో సమంత నిలవడం విశేషం. ఆమెకి రెండేళ్లుగా సినిమాలు లేవు. చివరగా `ఖుషి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకుంది. అయితే ఇటీవల ఆమె `సిటాడెల్`తో ఓటీటీ ఆడియెన్స్ ని పలకరించింది. దీనికి మంచి స్పందనే లభించింది. కానీ ఆమె తన వ్యక్తిగత జీవితం విషయంలో బాగా వైరల్ అయ్యింది. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం, ఈ క్రమంలో సమంత గురించిన చర్చ జరిగింది. అందుకే ఈ అమ్మడు ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్గా నిలిచింది.
ఇక రెండో స్థానంలో అలియా భట్ నిలిచింది. `ఆర్ఆర్ఆర్`తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన ఆలియాభట్. ఆమె చివరగా `జిగ్రా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
మూడో స్థానంలో `కల్కి 2898 ఏడీ` నటి దీపికా పదుకొనె నిలిచారు. ఆమె గతేడాది `కల్కి`, `సింగం అగైన్` చిత్రాలతో అలరించారు. అంతేకాదు తల్లి అయిన సందర్భంగానూ ఆమె పాపులర్ అయిన విషయం తెలిసిందే. కూతురికి జన్మనిచ్చింది.
నాల్గో స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచారు. ఆమె `పుష్ప 2`తో ఇండియా వైడ్గా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఈ లిస్ట్ లో స్థానం సంపాదించింది.
ఐదో స్థానంలో సాయి పల్లవి నిలిచింది. ఆమె చివరగా `అమరన్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇది మేజర్ ముకుంద్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇందులో ముకుంద్ కి భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఆరో స్థానంలో త్రిష నిలిచింది. ఆమె ప్రస్తుతం నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది విజయ్తో `గోట్` మూవీలో నటించింది. అదే సమయంలో ఆయనతో ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో నిలిచింది. మరోవైపు అజిత్తో రెండు సినిమాలు చేస్తుంది. ఇలా నిత్యం వార్తల్లో నిలుస్తుంది త్రిష.
నయనతారకి కూడా గతేడాది సినిమాలు లేవు. కానీ చివర్లో `నయనతారః బియాండ్ ది ఫెయిరీ టేల్` పేరుతో ఆమె డాక్యుమెంటరీ విడుదలైంది. ఇది పెద్ద సంచలనంగా మారింది. వివాదంగానూ మారింది. అందుకే నయనతార పాపులర్ అయ్యింది. దీంతో ఇండియా మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో ఏడో స్థానంలో నిలచింది.
కాజల్ కి పెద్దగా సినిమాలు లేవు, కానీ టాప్ 10లో స్థానం సంపాదించింది. ఆమె ఎనిమిదో స్థానం దక్కించుకుంది. యాడ్స్ ద్వారా ఆమె వార్తల్లో నిలవడం విశేషం.
శ్రీలీల కూడా హీరోయిన్గా పెద్దగా సినిమాలు లేవు. కానీ గత నెలలో ఆమె `పుష్ప 2`తో మెరిసింది. ఇందులో స్పెషల్ సాంగ్ `కిసిక్`లో బన్నీతో స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతోనే ఆమె పాపులర్ అయిపోయింది. టాప్ 9గా నిలిచింది.
ఇక టాప్ 10లో చివరి స్థానంలో ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నిలిచింది. ఆమె గతేడాది `స్ట్రీ2` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎనిమిది వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. కానీ ఆమె గురించి చర్చ ఏడాది మొత్తం నడుస్తూనే ఉంది.