ఈ క్రమంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన `భైరవ ద్వీపం` చిత్రంతో ఆయనకు మంచి బ్రేక్ వచ్చింది. ఇందులో మాంత్రికుడిగా కనిపించి మెప్పించారు. క్రూరమైన విలనిజం చూపించి ఆకట్టుకున్నారు. అలాగే ఈవీవీ సత్యనారాయణ రూపొందించిన `మగరాయుడు` సినిమాలో జిన్నా అనే విలన్ పాత్రతోనూ అందరిని ఆకర్షించారు. ఆ తర్వాత ఐదేళ్లు విదేశాలకు వెళ్లారు. దీంతో నటుడిగా గ్యాప్ వచ్చింది.
అక్కడి నుంచి వచ్చి `ఉరి` సినిమాలో నటించారు. అది పేరుని తీసుకురాలేకపోయింది. ఈ క్రమంలో గోపీచంద్ హీరోగా వచ్చిన `యజ్ఞం` మూవీ సైతం విజయ రంగరాజుకి మరింత గుర్తింపుని తీసుకొచ్చింది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు. `విశాఖ ఎక్స్ ప్రెస్`, `ఢమరుకం`, `బ్యాండ్ బాజా`, `శ్లోకం` చిత్రాలతో ఆకట్టుకున్నారు విజయ రంగ రాజు.