ఈ సినిమాతో మోక్షజ్ఞ అక్క, బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారడం విశేషం. లెజెండ్ ప్రొడక్షన్ పతాకంపై ఆమె ఈ మూవీకి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మైథలాజికల్ ఫిల్మ్ గా దీన్ని రూపొందించబోతున్నారు.
సోషియో ఫాంటసీగా తీర్చిదిద్దబోతున్నారు ప్రశాంత్ వర్మ. పురణాలను, నేటి సమాజాన్ని మిక్స్ చేస్తూ తెరకెక్కించబోతున్నారట. ఇదిలా ఉంటే ఈ మూవీకి `సింబా` అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. గురువారం ప్రశాంత్ వర్మ సినిమాటిక్యూనివర్స్ నుంచి ఓ పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో `సింబా` అని ఉంది. అదే మోక్షజ్ఞ కోసమే తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.