ఇందులో మోహన్బాబు పంచుకున్న కామెడీ ఏంటంటే ఈ సినిమాలో అటు అన్న మోహన్ బాబు భార్య, ఇటు చిరంజీవి భార్య ఇంటి నుంచి పట్నం పారిపోతారు. ఈ విషయం తెలిసి ఈ ఇద్దరు సంబరాలు చేసుకుంటారు. ఇదేఇందులో హైలైట్గా నిలిచింది. దీనిపై మోహన్ బాబు స్పందిస్తూ, నా సినీ ప్రయాణంలో 1982లో వచ్చిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
ఎంతో ప్రతిభావంతుడైన మౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నా పాత్ర ఎంతో సంతృప్తిని కలిగించింది. ముఖ్యంగా నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం, ఆయనకు అన్నగా నటించడం ప్రత్యేక అనుభుతిని మిగిల్చింది` అని తెలిపారు మోహన్ బాబు. తన కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచి పోతుందని తెలిపారు.