మిస్‌ వరల్డ్ 2025 టాప్‌లోకి దూసుకొచ్చిన మరో నలుగురు అందగత్తెలు.. ఫైనల్‌ ఎంపిక చేసే విధానం ఇదే

Published : May 27, 2025, 09:01 PM IST

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు చివరి దశకు చేరుకుంటున్నాయి. గ్రాండ్‌ ఫినాలేకి ఇంకా నాలుగు రోజులే ఉంది. దీంతో ఎవరు విన్నర్‌ అవుతారనే ఉత్కంఠ నెలకొంది.

PREV
15
మిస్‌ వరల్డ్ 2025 `బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌` విన్నర్స్

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయి. దీంతో ఫైనల్‌ ఎంపిక ప్రాసెస్‌ జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే మొదటి క్వార్టర్ ఫైనల్‌లో భాగంగా టాప్‌40లో పది మంది అందగత్తెలు స్థానం సంపాదించారు. ఇప్పుడు కొత్తగా మరో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. లేటెస్ట్ గా జరిగిన `బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌`   పోటీల్లో నలుగురు అందగత్తెలు విన్నర్‌గా నిలిచారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే టాప్‌ 40లో స్థానం సంపాదించుకోగా, కొత్తగా మరో ఇద్దరు ఈ జాబితాలో చేరారు.

25
మిస్‌ వరల్డ్ 2025 టాప్‌ 40లో చోటు దక్కించుకున్న అందగత్తెలు

 `బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌`లో ఆఫ్రికా ఖండం నుంచి ఉగాండాకి చెందిన నటాషా న్యోన్యోజి, అమెరికా ఖండం నుంచి ప్యూట్రో రికోకి చెందిన వలెరియా పెరెజ్‌, ఆసియా ఖండం నుంచి ఇండోనేషియాకి చెందిన మోనికా కేజియా సెంబిరింగ్, యూరప్‌ ఖండం నుంచి వేల్స్ అందగత్తె మిల్లే మియా ఆడమ్స్ విన్నర్‌గా నిలిచారు. వీరంతా టాప్‌ 40లో చోటు సంపాదించారు. 

ఇప్పటికే ఇండియా అందగత్తె నందిని గుప్తా, అలాగే ఈస్తోనియాకి చెందిన ఎలిసే రాండ్మా, ఐర్లాండ్ కి చెందిన జాస్మిన గెర్హార్డ్, మార్టిన్‌క్యూకి చెందిన ఔరెల్లే జోవాచిమ్‌, నమీబియాకి చెందిన సెల్మా కమన్యా, త్రినిడాడ్‌ అండ్‌ టోబాగోకి చెందిన అన్నా లిసే నాంటన్‌, టర్కీకి చెందిన ఇడిల్ బిల్గెన్‌, జాంబియాకి చెందిన ఫెయిత్ బ్వాల్యా టాప్‌ 40 అందగత్తెల్లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే.

35
మిస్‌ వరల్డ్ 2025 ఫైనల్‌ ఎంపిక పద్ధతి ఇదే

మరో మూడు దశల్లో ఫైనల్స్ జరగనున్నాయి. ఫస్ట్ క్వార్టర్‌ ఫైనల్‌లో భాగంగా ప్రస్తుతం టాప్‌ 40లో ఒక్కోఖండం నుంచి పది మంది అందగత్తెలను ఎంపిక చేస్తారు. టాప్‌ 20 కోసం వీరిలో ఒక్కో ఖండం నుంచి ఐదుగురుని ఎంపిక చేస్తారు. ఇది సెకండ్‌ క్వార్డర్‌ ఫైనల్‌. 

ఆ తర్వాత సెమీ ఫైనల్‌ కోసం టాప్‌ 8 అందగత్తెలను ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. వీరంతా ఫైనల్‌లో పాల్గొంటారు. గ్రాండ్‌ ఫినాలేలో ఒక్క ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి, అంతిమంగా వారిలో ఒకరిని విన్నర్‌గా నిర్ణయిస్తారు. నలుగురిలో ఒకరు విన్నర్‌ అయితే, మిగిలిన ముగ్గురు రన్నరప్స్ గా నిలుస్తారు.

45
ఇండియా అందగత్తె నందిని గుప్తాపైనే ఆశలు

ఈ పోటీల్లో మన ఇండియా నుంచి పోటీ పడుతున్న రాజస్థాన్‌ అమ్మాయి నందిని గుప్తా ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ పోటీల్లో ఆరుసార్లు మన ఇండియాకి చెందిన అందగత్తెలు విన్నర్ గా నిలిచారు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నందిని గుప్తా ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ మిస్‌ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన గ్రాండ్‌ ఫినాలే మే 31న జరగబోతున్న విషయం తెలిసిందే.

55
తెలంగాణ కల్చర్‌ని ఎక్స్ ప్లోర్‌ చేసిన సుందరీమణులు

ఇక 108 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ మిస్‌ వరల్డ్ పోటీల్లో పాల్గొనగా మే 12న హైదరాబాద్‌లోని హైటెక్స్ లో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ ఈవెంట్‌ ప్రారంభమైంది. ఇక తెలంగాణ కల్చర్‌ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

 అందులో భాగంగానే ఈ అందగత్తెలు మన తెలంగాణలోని టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన ఫుడ్‌, మన కట్టుబాట్లు, మన దుస్తులు, మన రాష్ట్రంలోని అందమైన ప్రదేశాలు, ఆథ్యాత్మిక కేంద్రాలను సందర్శించి ప్రపంచానికి ఎక్స్ ప్లోర్‌ చేసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories