అయితే అందరిలాగే లక్ష రెండు లక్షలు ఇచ్చి వదిలేస్తారు అనుకున్నాను కాని ఆయన ఏకంగా ఆసుపత్రి ఖర్చులన్నీ పెట్టుకున్నారు. నాకు కిడ్నీ ప్రాబ్లమ్ రావడంతో అపోలోలో నాకు ట్రీట్మెంట్ చేశారు. దాని కోసం ఆయన దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు పొన్నంబళం. తాను కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఉన్నపుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు డయాలసిస్ కోసం మాత్రమే సాయం చేశారని చెప్పారు.
అయితే లాస్ట్ ఇయర్ కోలుకుని హాస్పిటల్ కు చేరుకున్న పొన్నంబళం ..తాజాగా, మళ్లీ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వస్తుండటం ఆయన ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. అయితే ఈసారి ఏమైందన్న విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.