ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణం రాజు, నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్టీఆర్ సీఎం అయ్యారు. నేను, కృష్ణ, కృష్ణం రాజు ఎంపీలు అయ్యాం. మేమంతా సక్సెస్ అయ్యాం. అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడు వేరు. కానీ ప్రస్తుత రాజకీయాలు కమర్షియల్ అయిపోయాయి. కోటి రూపాయలు ఖర్చు చేస్తే 20 కోట్లు సంపాదిస్తున్నారు. రాజకీయాలు అలా అయిపోయాయి. చిరంజీవి గారి విషయంలో నేను బాధపడ్డాను.