చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తుంది. దీంతోపాటు కాస్ట్యూమ్ డిజైనింగ్గానూ రాణిస్తుంది. చిరంజీవికి చాలా సినిమాలకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా `పరువు` అనే వెబ్ సిరీస్ నిర్మించింది. ఇది జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
తాజాగా సుస్మిత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. తన సంతోషాన్ని పంచుకోవడంతోపాటు, ఆయన గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. బాబాయ్ ని తనకు పెద్ద అన్నలాంటి వాడు అని, ఆయన్ని బాబాయ్గా ఎప్పుడూ చూసేవాళ్లం కాదు, అన్నలాగా భావించామని చెప్పింది సుస్మిత.
Pawan Kalyan
రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు, కానీఎప్పుడైనా సక్సెస్ అవుతాడని భావించాం. ఇంత పెద్ద విజయాన్ని ఊహించలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఫ్యామిలీలో ఆనందానికి అవదుల్లేవ్. ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉన్నామని తెలిపింది సుస్మిత కొణిదెల.
ఈ సందర్భంగా బాబాయ్ పవన్తో అనుబంధం గురించి చెబుతూ, చిన్నప్పుడు మమ్మల్ని బాగా ఆటపట్టించేవాడట. రామ్చరణ్, నా మధ్య గొడవలు పెట్టేవాడు. మేం గొడవలు పడుతుంటే ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం మమ్మల్ని వాడుకునేవాడు. అలాంటి నాటీ, చిలిపి యాంగిల్ కూడా బాబాయ్లో ఉంది` అని తెలిపింది సుస్మిత.
అంతేకాదు సరదా పార్ట్ పక్కన పెడితే ఎప్పుడూ ఓ ఐడియాలిజీతో, ఒక ఎయిమ్తో ఉండేవాడు. జనాల కోసం, జీవితంలో ఎలా ఉండాలనేది ఆలోచించేవాడు. స్వేచ్ఛగా ఉండటం, స్వేచ్ఛగా ఆలోచించడం ఆయనకే సాధ్యం అని తెలిపారు. ఆయన పదేళ్లు చాలా కష్టపడ్డాడు. నిరంతరం పోరాడాడు. ఇప్పుడు సాధించాడని తెలిపింది సుస్మిత కొణిదెల.
పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు తనపార్టీ నుంచి నిలబెట్టిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.