తమిళంలో కెరీర్ని ప్రారంభించిన మీనా తెలుగులోకి `సరిపురం మొనగాడు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ కలిసి నటించింది. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున వంటి వారితోనూ మూవీస్ చేసి మెప్పించింది. తిరుగులేని స్టార్గా ఎదిగింది.
మీనా సినీరంగంలో ఇన్ని సంవత్సరాలు రాణించడానికి ఆమె తల్లి కూడా ఒక కారణం. ప్రతి సినిమాను చూసి చూసి నటింపజేసేవారు. ఏ సినిమా చేయాలో, ఏది వద్దో చెప్పేవారు. దీనివల్ల కొన్ని మంచి సినిమాలు కూడా ఆమెకు చేజారిపోయాయి. అలా చేజారిపోయిన సినిమాల గురించి మీనానే చెప్పింది. అందులో ముఖ్యమైనది శివాజీ గణేషన్, కమల్ హాసన్ నటించిన `క్షత్రియ పుత్రుడు`(“దేవర్ మగన్) కూడా ఉంది. మరి ఇది ఎలా మిస్ అయ్యిందనేది చూస్తే.