55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : May 06, 2026, 02:09 PM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్టరీలో క్రేజీ హీరోయిన్, దాదాపు స్టార్ హీరోలందరితో ఆడి పాడిన సీనియర్ బ్యూటీ, 12 మందితో ఎఫైర్ రూమర్స్, ఒకరితో పెళ్లి, విడాకులు, చివరకు 55 ఏళ్ల వయసులో ఒంటరిగా జీవిస్తోన్ననటి ఎవరో తెలుసా?

PREV
15
ఫిల్మ్ ఇండస్ట్రీ రంగులు ప్రపంచం..

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే హంగులు.. ఆర్భాటాలు, లగ్జరీ లైఫ్ మాత్రమే కనిపిస్తుంటుంది. కానీ తెర వెనుక చాలామంది జీవితం దుర్భరంగా ఉంటుంది. కొంత మంది ఆస్తులు పోగోట్టుకుంటే.. మరికొంత మంది ఆరోగ్యాన్ని కోల్పోతుంటారు. మరికోంత మంది ఎవరిచేతిలోనో మోసపోయి జీవితం నాశనం చేసుకుంటుంటారు. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీని తన బ్యూటీతో ఒక ఊపు ఊపేసిన ఓ హీరోయిన్ 55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం గడుపుతోంది. కోట్లు సంపాదించిన ఆమె క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు మనీషా కొయిరాలా.

25
33 ఏళ్ల సినిమా జీవితంలో..

1970లో నేపాల్‌లో జన్మించిన మనీషా కోయిరాలా, 1991లో తన నటజీవితాన్ని బాలీవుడ్‌లో సౌదాగర్ సినిమా ద్వారా స్టార్ట్ చేసింది. దాదాపు 33 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎన్నోబ్లాక్ బస్టర్ మూవీస్ చేసింది మనీషా. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్.. చిన్నగా సౌత్ లోకి కూడా ఎంటర్ అయ్యింది. తెలుగు తమిళ సినిమాల్లో నటించి, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఒక ఊపు ఊపేసింది.

35
12 మంది స్టార్స్ తో ఎఫైర్ నిజమెంత?

ఎందరో స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మనీషా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో 12 మందితో ప్రేమాయణం నడిపించిందని టాక్. మనీషా కోయిరాలా లవ్ అఫైర్స్ ఆమె కెరీర్ లో స్టార్ డమ్ కంటే కూడా ఎక్కువగా పాపులర్ అయ్యేలా చేశాయి. వివేక్ ముశ్రన్‌తో మనీషా కోయిరాల మొదటి ప్రేమ మొదలైంది, ఆ తరువాత నానా పటేకర్‌, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, రాజీవ్ మూల్‌చందానీ, సంగీత దర్శకుడు సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్‌లు లాంటి స్టార్స్ తో ఆమె డేటింగ్ చేసినట్టు సమాచారం. ఆ రూమర్స్ మధ్యే ఆమె పెళ్లి చేసుకున్నా.. ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు.

45
పెళ్లైన రెండేళ్లకే విడాకులు..

2010 లో మనీషా కొయిరాలా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను పెళ్ళి చేసుకుంది. కాని వారి వివాహజీవితం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన రెండేళ్ళకే.. 2012 లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఒంటరి జీవితాన్నే గడుపుతోంది.

55
క్యాన్సర్‌ ను జయించిన మనీషా కోయిరాలా..

2012లో అండాశయ క్యాన్సర్ బారిన పడింది మనీషా. భయంకరమైన వ్యాధి ఇబ్బందిపెడుతున్నా.. ఎంతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడింది. కొన్నేళ్ల క్రితం ఆ వ్యాధి నుంచి కోలుకుంది స్టార్ బ్యూటీ. అంతే కాదు అప్పటి నుంచి క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ.. బాధితులకు అండగా నిలబడింది. జనవరి 8, 2018న ముంబైలో ఆమె తన ఆత్మకథ – హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్‌ను ఆవిష్కరించింది. ఆమె తన పుస్తకంలో ఎలా క్యాన్సర్‌ ను జయించింది అన్న విషయాలను వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories