మంచు మనోజ్‌ కూతురికీ.. సాయి ధరమ్‌ తేజ్‌ కొడుక్కీ పెళ్లంట!

First Published Jun 29, 2020, 3:56 PM IST

టాలీవుడ్‌ యంగ్ హీరో మంచు మనోజ్‌ సోషల్ మీడియా చేసే కామెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. సినీ అప్‌డేట్స్‌తో పాటు రాజకీయ సామాజిక అంశాల మీద కూడా తనదైన స్టైల్‌లో స్పందిస్తుంటాడు మనోజ్‌. తాజాగా యంగ్ హీరో చేసిన ఓ ఫన్నీ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మధ్య కాలంలో సినిమాలు తక్కువగానే చేసినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటున్నాడు మంచు వారబ్బాయి మనోజ్‌. వరుస ఫ్లాప్‌లతో కెరీర్ పాడవ్వటంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఒక దశలో ఇక సినిమాలకు గుడ్‌ బై చెప్పేస్తున్నా అంటూ కామెంట్ చేసి తరువాత ఆ మాటలను వెనక్కు తీసుకున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఈ మధ్యే ఓ ఇంట్రస్టింగ్ భారీ ప్రాజెక్ట్‌ ను ఎనౌన్స్ చేశాడు మనోజ్‌.
undefined
అహం బ్రహ్మాస్మి పేరుతో మల్టీ లింగ్యువల్‌ సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా పనులు ప్రారంభించాల్సి ఉండగా ఈ లోగా లాక్‌ డౌన్‌ రావటంతో ఆగిపోయింది. అయితే తాజాగా మంచు మనోజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసి ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తనకు మంచి అల్లుడ్ని ఇచ్చినందుకు వియ్యంకుడు సాయి ధరమ్‌ తేజ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌ను పెట్టాడు మనోజ్.
undefined
ఇక అసలు విషయానికి వస్తే మనోజ్‌ పెంపుడు కుక్క జోయా, సాయి ధరమ్ తేజ్‌ పెంపుడు కుక్క టాంగోల క్రాసింగ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌ను పెట్టాడు మనోజ్‌. ఇద్దరు హీరోలు వాళ్ల కుక్కలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన మనోజ్‌ `టాంగో, జోయాలకు ఇది డేట్‌ డే. ఇంత మంచి అల్లుడిని నాకు ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్‌ తేజ్‌కు థ్యాంక్స్‌. త్వరలోనే ముహూర్తం పెట్టించి శుభాకాంక్షలు వేయిస్తాం` అంటూ కామెంట్ చేశాడు.
undefined
ఇక సాయి ధరమ్‌ తేజ్‌ విషయానికి వస్తే... ఇటీవల ప్రతి రోజు పండగే సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.
undefined
click me!