తన విషయంలో తండ్రీ కొడుకు మోహన్బాబు, విష్ణులు చేస్తున్న పనులు, తనని దూరం పెట్టే చర్యలు మనోజ్ ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తుంది. నిన్న సోమవారం మనోజ్ భార్య మౌనికా రెడ్డి అమ్మ శోభా నాగిరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలోని ఆమె సమాధిని సందర్శించారు మనోజ్, మౌనికా రెడ్డి.
తన కూతురు దేవసేన శోభ జన్మించిన తర్వాత ఎప్పుడూ రాలేదని, మొదటిసారి కూతురుని తీసుకుని ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని మనోజ్ తెలిపారు. ఫ్యామిలీతోపాటు, తన అనుచరులు, ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చినట్టు తెలిపారు మనోజ్. ఈ సందర్భంగా రాజకీయ ఎంట్రీపై ఆయన నో కామెంట్ అన్నాడు.