ఇక చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీలో నయనతార హీరోయిన్గా నటించింది. వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. కామెడీ, ఫ్యామిలీ అంశాలు, పిల్లలకు నచ్చే ఎలిమెంట్లు, మహిళలకు సంబంధించిన అంశాలు, యూత్ని ఆకట్టుకునే లవ్ ట్రాక్, యాక్షన్ ఎలిమెంట్లని జోడించి ఈ సినిమా రూపొందించారు అనిల్ రావిపూడి. సంక్రాంతి పండక్కి మంచి విందు భోజనం పెట్టారు. దీంతో సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీని చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. చిరంజీవితో చేసిన తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది సుస్మిత.