Guppedantha manasu: రిషికి గౌతమ్ సలహా.. వసుధారకు క్లాస్ పీకిన మహేంద్ర!

First Published Aug 23, 2022, 11:01 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఆగస్ట్ 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... వసు, కారుతో రిషి సార్,ఇప్పుడు మీరు నా ముందు కనిపించండి. మీకు ప్రశ్నల వర్షం కురిపిస్తాను టక టక ప్రశ్నలు అడుగుతాను అని అంటుంది.అప్పుడు రిషి అక్కడికి వెళ్ళగానే మీరు ఎప్పుడు నుంచి ఇక్కడ ఉన్నారు సార్ అంతా విన్నారా అని అడుగుతుంది వసు.చెవులు బానే ఉన్నాయి అని అన్నాడు రిషి.అవును నేను వస్తే ఏదో ప్రశ్నల వర్షం కురిపిస్తా అన్నావ్ కదా ఏంటి అని అడగగా ఏమీ లేదు సార్ క్లాస్ టైం అవుతుంది అని అంటుంది. ఇంతట్లో వసు దగ్గర నోట్స్ తీసుకొని వెళ్లిపోతాడు రిషి. అప్పుడు వసు మనసులో,నెమ్మదిగా ఏమైంది వసుధార  చెప్పు అని అడగాలి కాని ఇలాగైతే ఎలాగా అని అనుకుంటూ ఉంటుంది. 

ఆ తర్వాత రిషి మీటింగ్ కి వెళ్తాడు పరీక్షలు అవ్వకముందు పిల్లలకి ఫేర్వెల్ పెట్టి అందులో చదువు గురించి నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళ మనసులు కూల్ చేయాలి. దానికోసం ఏర్పాట్లు చేయండి అని అంటాడు రిషి. తర్వాత జగతి బాధపడుతూ మీటింగ్ నుంచి బయటికి వస్తుంది. ఏమైంది జగతి అని మహీంద్రా అడగగా ఈ సంవత్సరం పిల్లలు పరీక్షలు అయిపోగానే వెళ్ళిపోతారు. ఇంక వారికి మనకు సంబంధాలు ఉండవు కదా. చాలా స్నేహాలు ఉన్నాయి అందులో మన వసు కూడా వెళ్ళిపోతుంది.రిషికి బాల్యం లేని లోటు తీర్చింది ఎన్నో తీపి జ్ఞాపకాలు ఇచ్చింది. ఇప్పటికి వీళ్ళు కలవకపోతే ఇంకెప్పటికీ కలవలేరు అని అనుకుంటారు జగతి మహేంద్రులు. అప్పుడు గౌతమ్ రిషి దగ్గరికి వెళ్లి వసుధార నిన్ను ప్రేమిస్తుంది కదా అని అంటాడు. 

అప్పుడు రిషి ఒకేసారి కోపంగా గౌతమ్ వైపు చూస్తాడు అప్పుడు గౌతమ్, నేను నీకు భయపడే వాడిని కాదు చెప్పు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వసు మీకు దొరకదు. ఇదే నీకున్న చివరి అవకాశం అని గౌతమ్ అనగా, రిషి నేను ఒకటి అనుకున్నాను. అది అయితే మంచిగా జరుగుతుంది అని అంటాడు,ఒకవేళ అవ్వకపోతె అని గౌతమ్ అడగగా,అవ్వకపోతే అవ్వదు ఇంక వదిలేయ్ అని అంటాడు రిషి.నీకు వసుధారకి మధ్య గొడవలేమీ లేవు అసలు సమస్య మీ ఇద్దరే. మీకు మీ ఇద్దరూ ఇష్టమే కానీ ఒకరికొకరు అర్థం చేసుకొని మాట్లాడుకోలేరు అలా ఒకసారి మాట్లాడితే మీరు కలిసిపోతారు అని అంటాడు గౌతమ్. ఇప్పుడు దీని గురించి ఇంకేం మాట్లాడద్దు అని రిషి అనగా ఆ మాటలు విన్న వాసు అక్కడి నుంచి బయటకు వస్తుంది. 

అప్పుడు దాని తర్వాత వసు అమ్మవారి దగ్గరికి వెళ్లి నా మనసులో మాటలని నీకు చెప్పుకున్నాను అమ్మా. ఎలాగైనా మమ్మల్ని కలుపు అని అనగా ,మహేంద్ర ఈ మాటలని వింటాడు. డబ్బులు దాచుకున్నట్టు ప్రేమని అలా మనసులో దాచుకోకూడదు వసు. ఒకప్పుడు నేను,జగతి రిషి గురించి ఆలోచించే వాళ్ళం ఇప్పుడు మేము నీ గురించి ఆలోచిస్తున్నాము. మనసులో అంత ప్రేమ ఉన్నప్పుడు ఒక అడుగు ముందుకు వెయ్యి వసు. నీ మనసులో ఏముందో నేను అడగడం లేదు అది నీకు తెలుసు మంచేదో చెడ్డదో తెలుసు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ అవ్వదు అని వసుతో చెప్పి వీళ్ళిద్దరినీ కలుపు అని దేవుడిని దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహేంద్ర. 

ఆ తర్వాత సీన్లో రిషి ఫోన్ లో వసు ఫోటో పట్టుకొని నిజంగా వసుధార దూరమైపోతదా? పరీక్షలు అయిపోయాక ఇంక కనిపించదా అని గతంలో వసుధారతో జరిగిన విషయాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు రిషి. ఇంతటిలో వసుధర కూడా ఆ ఉంగరం మీద v,r చేయించుకుని దాని గురించి అంతా ఆలోచిస్తూ ఉంటే పోనీ నేనే ముందుగా అడగనా అని అనుకుంటుంది.అదే సమయంలో రిషి వద్దు అనుకున్న సాక్షి తానుగా దూరమైంది కానీ కావాలనుకున్న వసుధార ఎందుకు దగ్గర అవడం లేదు. నా వైపు ఏమైనా తప్పు ఉన్నదా అని అనుకుంటాడు. అప్పుడు వసు నా వైపు తప్పు ఉంది. ఆ తప్పుని నేను సరిదిద్దుకుంటాను అని అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!