నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

tirumala AN | Published : Jul 6, 2024 2:52 PM

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. 

16
నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది
Mahesh Babu

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. 

 

26

ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన వంటకం గురించి చెప్పారు. నీకు ఇష్టమైన వంటకం ఏంటి అని కీరవాణి అడగగా తారక్ సమాధానం ఇచ్చారు. నాటుకోడిని కాల్చి దానికి కారం, ఉప్పు, పసుపు, అల్లం దట్టించి.. పక్కనే చికెన్ కీమా కొట్టించి.. ఈ రెండింటిని బాగా కాల్చాలి. ఆ తర్వాత పెద్ద రోటీ చేయించుకుని ఆ రోటితో ఈ చికెన్ మొత్తం తినేయాలి అని ఎన్టీఆర్ తెలిపాడు. 

36

ఈ తిండి పిచ్చి తనకు తాతగారి వల్లే వచ్చింది అని ఎన్టీఆర్ తెలిపాడు. చిన్నప్పుడు తాతగారు నెయ్యిలో ఇడ్లీలు ముంచి పెట్టేవారు. అలాగే తినేసేవాళ్ళం అని తారక్ తెలిపాడు. 

46

తారక్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది. మహేష్ కూడా తారక్ తింటున్న విధానం చూశాడట. మహేష్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొన్నప్పుడు ఈ విషయం చెప్పారు. 

 

56

మహేష్ మాట్లాడుతూ..నీ గురించి కూడా చెప్పాలి. నువ్వెలా తినేవాడివో నాకు తెలుసు. నెయ్యిలో ఇడ్లీలు ముంచి మరీ తినేవాడివి. ఇప్పుడు కాస్త ఇలా కూర్చుంటున్నావు కానీ.. ఎలా తినేవాడివో నాకు తెలుసు అని మహేష్ తెలిపాడు. మహేష్ మాటలకు తారక్ సిగ్గుపడుతూ కనిపించాడు. 

66

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్టీఆర్ ఎంత తింటారో అంతగా ఫిట్ నెస్ మైంటైన్ చేస్తారు. రాఖీ సమయంలో బరువు విషయంలో విమర్శలు ఎదుర్కొన్న తారక్ ఆ తర్వాత సన్నబడ్డాడు. 

 

click me!