ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన వంటకం గురించి చెప్పారు. నీకు ఇష్టమైన వంటకం ఏంటి అని కీరవాణి అడగగా తారక్ సమాధానం ఇచ్చారు. నాటుకోడిని కాల్చి దానికి కారం, ఉప్పు, పసుపు, అల్లం దట్టించి.. పక్కనే చికెన్ కీమా కొట్టించి.. ఈ రెండింటిని బాగా కాల్చాలి. ఆ తర్వాత పెద్ద రోటీ చేయించుకుని ఆ రోటితో ఈ చికెన్ మొత్తం తినేయాలి అని ఎన్టీఆర్ తెలిపాడు.