మహేష్ సినిమా చేయడానికి ఓకే చెప్పినప్పుడు ఎవరితో చేయాలనే ఆలోచనలో పడ్డానని, ఆ సమయంలో గుణశేఖర్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అనిపించిందని, ఆయనతో కథా చర్చలకు కూర్చొని కొన్ని మార్పులు చేసి, ఆ తర్వాత మహేష్కి వినిపించామని, ఆయన ఓకే చేశారని తెలిపారు. అయితే సినిమా ప్రారంభంలోనే కొండారెడ్డి బురుజు వద్ద ఫైట్ సీన్ ఉంటుందని, అది పెడితే వర్కౌట్ కాదని తానే చెప్పానని, పరుచూరి బ్రదర్స్ వంటి కొందరికి సినిమా చూపించిన తర్వాత మార్పులు చేశామని, సినిమా పెద్ద హిట్ అయ్యిందని తెలిపారు. ఇది మహేష్కి తమకి మైల్ స్టోన్ మూవీగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఎంఎస్ రాజు `అగాధ` అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు రెడీ అవుతుంది.