ఇక రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే సింహభాగం రెమ్యునరేషన్ అందుకునేది మహేష్ బాబు, రాజమౌళినే. ఈ చిత్రం కోసం మహేష్, రాజమౌళి స్ట్రాటజీ మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి, మహేష్ ఇద్దరూ తమ ప్రతి చిత్రంలో కొంత భాగం షేర్ తీసుకుంటారు. కానీ ఈ చిత్రానికి మాత్రం వీరిద్దరి వాటా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం మహేష్ బాబు, రాజమౌళి 40 శాతం వాటా తీసుకోబోతున్నారట. ఇద్దరూ రెమ్యునరేషన్ బాగా తగ్గించుకుని వాటా ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఏది ఏమైనా ఈ చిత్రం లాంచ్ తర్వాత రాజమౌళి ఎలాంటి విషయాలు రివీల్ చేస్తారు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.