అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్.. ఇటీవల సక్సెస్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. ఆయన సినిమాలు ఓటీటీలు ఆడుతున్నాయి, కానీ థియేటర్లో సత్తా చాటడం లేదు. అయినా తాను బాక్సాఫీసు వద్ద నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా గత వారం ఆయన `మహేంద్రగిరి వారాహి` అనే చిత్రంలో నటించారు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, మళవిక నాయర్, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.