Guppedantha Manasu: వామ్మో.. రిషి, వసుల సింగిల్ బెడ్ రూమ్ వ్యవహారాన్ని కనిపెట్టేసిన సాక్షి!

First Published May 21, 2022, 9:00 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే మహేంద్ర (Mahendra) రిషి కు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు. ఇక రిషి (Rishi) చిరాకు పడుతూ నేను ఇంటికి వెళ్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు వసు రిషి గురించి ఆలోచిస్తూ తన పక్క సీట్ లో రిషి ఉన్నట్లు ఊహించుకుంటుంది. ఏదైనా రిషి సార్ పక్కన ఉంటే ఒక ధైర్యం వస్తుంది అని అంటుంది.
 

ఈలోపు వసు (Vasu) వెళుతున్న బస్ కి రిషి కారుకు అడ్డంగా పెట్టి  వసు ను తీసుకొని బయటకు వస్తాడు. ఇక తన కారులో తీసుకొని వెళతాడు. ఈ క్రమంలో వసు ఎటు వెళుతున్నాము సార్ అని అడుగుతుంది. మనం సరికొత్త ప్రయాణం చేయబోతున్నాము అని రిషి (Rishi) అంటాడు. అంతే కాకుండా ఎగ్జామ్ కి బస్సులోనే వెళ్లాలా నా కారులో వెళ్ళకూడదా అని అంటాడు.
 

ఆ మాటతో వసు (Vasu) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక వసు వచ్చినందుకు థాంక్స్ సార్ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని అంటుంది. ఈ క్రమంలో వసు బుక్ చూసుకుంటూ అందంగా నిద్రపోతుంది. మరోవైపు మహేంద్ర (Mahendra) కొంపదీసి మనవాడు వసు తో కలిసి వెళ్లాడా అని అనుమానం పడతాడు.
 

ఒకసారి వసు (Vasu) కు ఫోన్ చేసి తెలుసుకుందామా అని జగతి తో అంటాడు. ఈలోపు అక్కడకు దేవయాని వచ్చి రిషి కాలేజ్ పనిమీద బయటికి వెళ్లాడు అని చెబుతుంది. మరోవైపు రిషి (Rishi) వసుకు నిద్ర వస్తున్నందుకు కాఫీ కోసం ఒక దాబా దగ్గర ఆగుతారు. ఇక అక్కడే ఉన్న ఒక వ్యక్తి వసు ను అదే పనిగా చూస్తుంటాడు.
 

ఇక అది గమనించిన రిషి (Rishi)..  ఆ వ్యక్తిని గట్టిగా చెంప మీద కొడతాడు. కానీ ఇదంతా రిషి జరిగినట్టు ఊహించుకుంటాడు. ఇక రిషి వసు (Vasu) ను మరోవైపు కూర్చోబెడతాడు. ఎందుకు అని వసు అడగగా లోక కళ్యాణం కోసం అని చెబుతాడు.
 

ఇక తరువాయి భాగం లో రిషి (Rishi) లేట్ అయినందుకు గాను స్టే చేయడానికి సింగిల్ బెడ్ రూమ్ తనకు వసుకు కలిపి తీసుకుంటాడు. తర్వాత ఆ హోటల్ కి సాక్షి వచ్చి (Sakshi) రిషి అనే పేరుతో ఎవరైనా రూమ్ బుక్ చేసుకున్నారా? అని అడుగుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!