విక్రమ్ (Vikram) హీరోగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజే రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా నిర్మాతకు సమస్యలు ఎదురయ్యాయి. దాంతో కోర్టు తీర్పు మేరకు కోటి రూపాయలు డిపాజిట్ చేసి మరీ రిలీజ్ చేసారు.