మా ఎలక్షన్స్  కుసంస్కారుల మాటలు పట్టించుకోవద్దు.. బాలయ్యకు నాగబాబు కౌంటర్!

First Published Jul 16, 2021, 9:28 AM IST


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో మంట రగిల్చిన విషయం తెలిసిందే. మా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో ఈ వివాదంపై నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

తెలంగాణా ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నవారు కనీసం 'మా' బిల్డింగ్ కోసం ప్రయత్నం చేయలేరా అంటూ కౌంటర్లు విసిరారు. కరోనా సంక్షోభం సమయంలో చిరంజీవి, నాగార్జునతో పాటు మరికొందరు తెలంగాణా సీఎం కేసీఆర్ ని కలిశారు.
undefined
ఈ మీటింగ్స్ కి బాలకృష్ణకు ఆహ్వానించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ సంచలనం కామెంట్స్ చేయడం జరిగింది . మరో మారు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మా ఎన్నిక విషయంలో బాలకృష్ణ కామెంట్స్ చేశారు.
undefined
కాగా నిన్న బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో నాగబాబు కౌంటర్ ఇచ్చారు. నాగబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. వివిధ కారణాల వల్ల మా భవన నిర్మాణ విషయం మరుగునపడిందని నాగబాబు అన్నారు. బిల్డింగ్ కట్టేందుకు స్థలం ఎలా సేకరిస్తారో విష్ణు చెప్పాలని సూచించారు.
undefined
మా అసోసియేషన్ సభ్యులు కలిసికట్టుగా ఉండాలన్న నాగబాబు.. ప్రకాశ్ రాజ్ ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని.. ప్రకాశ్ రాజ్ ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని అన్నారు
undefined
మా అసోసియేషన్ ప్రతిష్ట మసకబారిందని తానే అన్నానని నాగబాబు తెలిపారు. లోకల్.. నాన్ లోకల్ అని నరేశ్, మంచు విష్ణు అనలేదని తెలిపారు.
undefined
కుసంస్కారులు మాట్లాడిన వాటిని పట్టించుకోవద్దని అన్నారు. 'మా' గొడవలు టీ కప్పులో తుఫాన్ లాంటివే అని.. మోహన్ బాబు, మేమంతా కలిసే ఉంటామని నాగబాబు వ్యాఖ్యానించారు. విష్ణు గెలిచినా.. ప్రకాశ్ రాజ్ గెలిచినా కలిసే పని చేస్తామని అన్నారు.
undefined
'మా'లో తెలంగాణ, ఆంధ్రా ఆర్టిస్టులు అనే భేదాలు లేవని నాగబాబు స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్‌కు ఉన్న వంద తలనొప్పుల్లో సినీ ఇండస్ట్రీ గురించి దృష్టి సారిస్తారని అనుకోవడం లేదని చెప్పారు.
undefined
click me!