Janaki Kalaganaledu: జానకి సన్మానం చేసిన పోలీసులు.. జ్ఞానాంబ కుటుంబ పరువు గంగలో కలిపిన లీలావతి!

Navya G   | Asianet News
Published : Jan 28, 2022, 11:43 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

PREV
16
Janaki Kalaganaledu: జానకి సన్మానం చేసిన పోలీసులు.. జ్ఞానాంబ కుటుంబ పరువు గంగలో కలిపిన లీలావతి!

జానకి (Janaki) బాంబు నుంచి ఎంతోమంది ప్రాణాలు కాపాడినందుకు పోలీస్ శాఖ తనను అందరి ముందు పొగుడుతుంది. అంతేకాకుండా తనకు ఐపీఎస్ చదివే అవకాశం కల్పిస్తామని పోలీస్ అధికారి చెబుతాడు. దానికి జానకి బాగా సంతోషపడుతుంది. రామచంద్ర (Rama Chandra) కూడా తెగ సంతోష పడతాడు.
 

26

ఇక పోలీస్ అధికారి ఐపీఎస్ చదవాలని కోరుతాడు. దాంతో జానకి (Janaki) సమాధానం ఇవ్వమని అడుగుతాడు. కానీ జానకి తన అత్తయ్య జ్ఞానాంబ మీద ఆధారపడటంతో సమాధానం చెప్పలేక పోతుంది. అదే సమయంలో లీలావతి (Lilavathi) వచ్చి తన మాటలతో జ్ఞానాంబను బాధ పెడుతుంది.
 

36

ఇక పోలీసు అధికారి మాత్రం జానకి నిర్ణయం అడగటంతో.. అందరూ జానకి (Janaki) ఒప్పుకోవాలి అని ఎంకరేజ్ చేస్తారు. అది చూసిన మల్లిక (Mallika) తట్టుకోలేక కుమిలిపోతుంది. గోవింద రాజు మల్లికను తన మాటలతో వెటకారం చేస్తాడు. ఇక జానకి తన నిర్ణయాన్ని తర్వాతకు చెబుతాను అంటుంది.
 

46

పోలీస్ శాఖ జానకికి సన్మానం చేయాలని అనుకుంటారు. దాంతో జానకి (Janaki) సంతోషపడుతుంది. పోలీస్ శాఖ మొత్తం దానికి కి సెల్యూట్ చేసి సన్మానం చేస్తారు. అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక అక్కడి నుంచి బయలుదేరుతుండగా మీడియా వాళ్లు వచ్చి జ్ఞానాంబ (Jnanamba) కుటుంబాన్ని ఎదుర్కొంటారు.
 

56

ఆ మీడియా వాళ్లకు లీలావతి (Lilavathi) లేనిపోనివన్నీ చెప్పి వాళ్లను పంపించినట్లుగా కనిపిస్తుంది. ఇక వాళ్ళు మీ కోడల్ని ఎందుకు చదివించడం లేదు అని మీడియా వాళ్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటం తో లీలావతి వచ్చి జ్ఞానాంబ (Jnanamba) కుటుంబం గురించి తనకు నోటికొచ్చిన మాటలతో మాట్లాడి తమ పరువు గంగలో కలుపుతుంది.
 

66

అప్పటికి జానకి (Janaki), రామ చంద్ర లీలావతి ను వాదిస్తూ ఉంటారు. అయినా కూడా తన మాటలతో రెచ్చిపోతుంది. ఇక ఇంటికి వెళ్లిన జ్ఞానాంబ అక్కడ జరిగిన విషయాలను గుర్తుకు చేసుకుంటుంది. మధ్యలో   జానకిని ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇక తరువాయి భాగం లో రామ చంద్ర (Rama Chandra) వచ్చి జానకి ఐపీఎస్ చదువు గురించి అడుగుతాడు.

click me!

Recommended Stories