Intinti Gruhalakshmi: తులసి, లాస్య గొడవకు తీర్పు చెప్పిన వసుధార.. భార్య కోసం నందు పోరాటం!

Published : Jul 12, 2022, 01:14 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Intinti Gruhalakshmi: తులసి, లాస్య గొడవకు తీర్పు చెప్పిన వసుధార.. భార్య కోసం నందు పోరాటం!

 ఈరోజు ఎపిసోడ్ లో వసు, సాక్షి లకు బోనం ఎలా తయారు చేయాలో చెబుతూ ఉంటుంది తులసి. అప్పుడు తులసి ఆంటీ అని పిలవగా తులసి నా పేరు ఎలా తెలుసు అని ఆశ్చర్య పోతుంది. అప్పుడు వసుధార మీరు ఎంతో మందికి ఆడవారికి స్ఫూర్తి అలాంటిది నీ పేరు తెలియకుండా ఉంటుందా అని అంటుంది. ఇక మరొకవైపు నందు లాస్య వాళ్ళు గుడికి వస్తారు.
 

27

అప్పుడు నందు లోపలికి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించుకో అని అనగా అప్పుడు లాస్య వీలైతే ఎంకరేజ్ చెయ్ అని అనడంతో వెంటనే నందు నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లాస్య,భాగ్య ఎలా అయినా కూడా చేసి బోనం సమర్పించకుండా ఉండాలి అని ప్లాన్లు వేస్తారు. ఇంతలో వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నందు వచ్చి మళ్ళీ పిలుస్తాడు. మరొకవైపు తులసి వాళ్ళు బోనం తయారు చేస్తూ ఉంటారు.
 

37


అప్పుడు తులసి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చూసి ఎప్పటికీ ఇలాగే ఉండేలా దీవించు తల్లి అని కోరుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నందు లాస్య వాళ్ళు అక్కడికి రావడంతో తులసి వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు భాగ్యవాలు కావాలనే తులసి వాళ్ళకి ఎదురుగా బోనం వండుతూ తులసి వాళ్లకు వినిపించే విధంగా గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు అనసూయ, భాగ్య, లాస్య లకీ గట్టిగా కౌంటర్ ఇస్తుంది.
 

47

 అప్పుడు తులసి అనసూయని సైలెంట్ గా ఉండమని చెబుతుంది. అప్పుడు తులసి బోనం కుండలు తీసుకుని రమ్మని చెప్పగా, అప్పుడు లాస్య భాగ్యకి ప్లాన్ చెప్పి దివ్యతో పాటు పంపిస్తుంది. అప్పుడు దివ్య కుండలను భుజాలపై పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉండగా భాగ్య వచ్చి వెనుక వైపు నుంచి తోయడంతో కుండలు పగిలిపోతాయి. అప్పుడు నలుగురు నాలుగు మాటలు అనడంతో లాస్య కూడా మరింత రెచ్చిపోయి తులసిని మాటలతో మాటలు అంటుంది.
 

57

అప్పుడు మాధవి వచ్చి తులసికి కుండలు ఇవ్వడంతో తులసి సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు భాగ్య  లాస్య తమ ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతూ ఉంటారు. అప్పుడు లాస్య, భాగ్య మళ్లీ ఎలాగా అయినా తులసి బోనాన్ని ఆపేయాలి అని చూస్తారు. అందుకోసం లాస్య నిద్ర మాత్రలు తులసికి ఇవ్వాలి అని భాగ్యకు లాస్య ప్లాన్ చెప్పి వివరిస్తుంది. ఆ తర్వాత తులసి నిద్ర మాత్రలు మింగినట్టు బోనం ఆగిపోయినట్టు లాస్య కలగంటూ ఉంటుంది.
 

67

 మరొకవైపు వసు, సాక్షి ఇద్దరు బోనం తీసుకొని వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు. మరొకవైపు తులసి వాళ్ళు బోనాలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు.. అప్పుడు భాగ్య కావాలనే ఇంటి బోనం ఎత్తే విషయంలో తులసి వాళ్ళతో గొడవ పడుతూ ఉండగా అప్పుడు మాధవి ఎంటర్ అయ్యి భాగ్య నోరు మూయిస్తుంది. ఇంతలో లాస్య రెచ్చిపోయి మాట్లాడడంతో అనసూయ మధ్యలో ఇన్వాల్వ్ అవుతుంది.
 

77

అలా వారిద్దరూ బోనం పట్టే విషయంలో పోట్లాడుకుంటూ ఉండగా చివరికి తులసి కీ ఆ అదృష్టం దక్కుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో అమ్మవారు వచ్చిన ఒక మహిళ తులసి కి మంచి రోజులు రాబోతున్నాయి త్వరలోనే ఒక వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నాడు అని అంటుంది. ఆ వ్యక్తి ఎవరో చూపిస్తారు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories