భార్య బాధితుల సంఘం పెట్టిన నాగబాబు.. లేడీ పంచ్‌కి మెగా బ్రదర్‌కి దిమ్మ తిరిగిపోయింది!

First Published Jan 20, 2021, 9:03 PM IST

మెగా బ్రదర్‌ నాగబాబు `జబర్దస్త్` కామెడీ, `అదిరింది` షోలతో జడ్జ్ గా ఆకట్టుకున్నారు. తాజాగా `ఖుషీ ఖుషీగా` పేరుతో యూట్యూబ్‌లో స్టాండప్‌ కామెడీకి తెరలేపారు. కొత్త ప్రతిభని వెలికితీస్తున్నారు. కానీ ఆయన చేస్తున్నది స్టాండప్‌ కామెడీగా లేదట భార్య బాధితుల సంఘం పెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో నాగబాబు మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది. ఆ విశేషాలు చూస్తే.. 
 

నాగబాబు మంచి హాస్య ప్రియుడు. కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తాడు. `జబర్దస్త్`లో ఆ విషయం నిరూపితమైంది. కంటెస్టెంట్లపై, టీమ్‌ మెంబర్స్ పై పంచ్‌లు వేస్తూ హైలైట్‌ అయ్యేవారు. తను కూడా కామెడీ పండించేవారు.
undefined
ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన పంచ్‌లు, భార్యాభర్తలకు సంబంధించిన స్కిట్‌ ల విషయంలో ఆయన బాగా ఇన్‌వాల్వ్ అయి పంచ్ లు వేస్తుంటారు.
undefined
ఆ తర్వాత ఆయన `బొమ్మ అదిరింది` షోలో కూడా జడ్జ్ గా ఇలాంటి పంచ్‌లు, జోకులతో నవ్వులు పూయించారు. అయితే ఇప్పుడు అందులో చేయడం లేదు నాగబాబు.
undefined
కొత్తగా యూట్యూబ్‌లో తన పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. ఇందులో `ఖుషీ ఖుషీగా` పేరుతో స్టాండప్‌ కామెడీ షోని నిర్వహిస్తున్నారు.
undefined
ఎక్కడో మారుమూలలకు చెందిన వారు కూడా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించారు. పైగా బాగా నవ్వించిన వారికి పది వేలు, 25వేలు, యాభై వేలు, లక్ష రూపాయల వరకు ప్రైజ్‌మనీ కూడా అందిస్తున్నారు.
undefined
గత కొన్ని రోజులుగా ఇది యూట్యూబ్‌లో బాగా పాపులర్‌ అయ్యింది. అయితే ఇందులో ఎక్కువగా భార్యాభర్తలకు సంబంధించిన జోకులే వేస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది.
undefined
భార్యతో కూడిన బాధలను భర్తలు నాగబాబు ముందు మొరపెట్టుకుంటున్నట్టుగా ఉందంటున్నారు. ఇదే విషయం ఇందులో స్టాండప్‌ కామెడీ చేసే లేడీ కంటెస్టెంట్‌ కూడా అనడం విశేషం.
undefined
వరుసగా భార్య వల్ల తలెత్తే సమస్యలు చెబుతుండటంతో విసిగిపోయిన ఓ లేడీ కమెడీయన్‌ `ఇదేదో స్టాండప్‌ కామెడీ షో కోసం వచ్చినట్టు లేదు.. భార్య బాధితుల సంఘానికి వచ్చినట్టుంది` అని నాగబాబుపైనే సెటైర్‌ వేసింది.
undefined
దీంతో పగలబడి నవ్వడం అక్కడున్న వారి వంతయ్యింది. దీన్ని కూడా కామెడీగా మార్చారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో శ్రీముఖి, గెటప్‌ శ్రీను కూడా ఉండటం విశేషం.
undefined
ఇక ఖమ్మం జిల్లాకి చెందిన సుధీర్‌ అనే వ్యక్తి నాగబాబు షోకి వచ్చి కామెడీ చేస్తున్నట్టుగా ఓ పలు అంశాలను పంచుకున్నారు. అలాగే గోవాకి టూర్‌ వెళ్దామని ప్లాన్‌ చేసినట్టు, తనని తీసుకెళ్లకుండా వెళ్లిన భర్తని భార్య ఏం చేసిందో మరో వ్యక్తి కామెడీగా చెప్పాడు.
undefined
అంతేకాదు లాక్‌ డౌన్‌లో, ఆన్‌ లైన్‌ క్లాసుల వల్ల ఏం జరుగుతుంది, పిల్లలు, పెద్దలు ఏం చేస్తున్నారనేది కామెడీ రూపంలో బాగా చెప్పారు. ఆడవారు ఒక్కరితోనే ఉండిపోతున్నారని, కానీ మగవాళ్లు, చిన్న ఇల్లు, పెద్ద ఇళ్లులు పెంచుకుంటూ పోతున్నారని లేడీ చెప్పిన కామెడీ నవ్వించింది.
undefined
అలాగే తన అన్నల నుంచి షర్ట్ పాయింట్‌ తను తీసుకోవడం, నేటి ప్యాంట్‌లో వచ్చిన ట్రెండ్‌లు కామెడీగా చెప్పిన విధానం నవ్వించాయి.
undefined
click me!