గీతాంజలి `మంచి రోజులు వచ్చాయి` సినిమాలో ఏఎన్నార్కి చెల్లిగా నటించింది. ఇందులో కాంచన హీరోయిన్ కాగా, కృష్ణంరాజు విలన్ పాత్రలో నటించాడు. ఇందులో ఓ సీన్లో గీతాంజలిని కృష్ణంరాజు ఇబ్బంది పెట్టాలి. రేప్ సీన్ అది. ఆ సన్నివేశం చేసేటప్పుడు గీతాంజలి నిజంగానే నరకం అనుభవించిందట.
ఇద్దరి మధ్య మాట మాట పెరిగి, కృష్ణంరాజుపై గీతాంజలి ఉమ్మేయాల్సి ఉంటుంది. ఆ సీన్ చేయడానికి గీతాంజలి చాలా ఇబ్బంది పడిందట. తన వల్ల కాదని చెప్పినా దర్శకుడు మధుసూధన రావు వినలేదు. దీంతో ఐస్ క్రీమ్ని నోట్లో వేసుకుని ఆ నూరగని ఉమ్మిందట.