
ఆ కాలంలో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు.. ఎంత కలిసి మెలిసి ఉండేవారో.. వారి మధ్య విభేదాలు కూడా అదే రేంజ్ లో కనిపించేవి. సినిమాల విషయంలో పోటీ పడుతూనే.. మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ.. సూపర్ హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కలిసి సినిమాలు చేశారు.. ఈ ఇద్దరి స్టార్ల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ హీరోల తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు మధ్య కూడా ఇలాంటి సందర్భాలే రిపిట్ అయ్యాయి. ఈక్రమంలో శోభన్ బాబుతో జరిగిన ఓ సంఘటన గురించి కృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమాలు లేక ఇబ్బందుల్లో ఉన్న శోభన్ బాబును ఆదుకోవాలని ముందుకు వచ్చారు కృష్ణ. కానీ శోభన్ బాబు మాత్రం సూపర్ స్టార్ కు హ్యాండ్ ఇచ్చారు. అదే టైమ్ లో కృష్ణ చేసిన పనికి శోభన్ బాబు షాక్ అయ్యారట. కృష్ణ కంటే ఇండస్ట్రీలో శోభన్ బాబు కాస్త సీనియర్.. దాంతో ఆ గౌవరం ఎప్పుడూ ఇస్తూ ఉండేవారు కృష్ణ.
ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసినా.. కృష్ణ మాత్రం ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను శోభన్ బాబుకే ఇవ్వండని మేకర్స్ కు చెప్పేవారట. ఈ విషయాలు కూడా కృష్ణ కొన్ని సందర్భాల్లో వెల్లడించారు. కానీ శోభన్ బాబు మాత్రం ఓసారి కృష్ణ నమ్మకాన్ని పోగోట్టుకున్నారట. సినిమాలు లేక ఇబ్బందుల్లో ఉన్న శోభన్ బాబుకు సాయం చేయడానికి వస్తే.. ఆయన ఏం చేశారంటే?
ఓ పాత ఇంటర్వ్యూలో కృష్ణ.. శోభన్ బాబు గురించి మాట్లాడుతూ.. '' ఒక సారి శోభన్ బాబు బాగా ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. నిర్మాతలు సినిమా చేయడానికి కూడా ముందుకు రావడంలేదు. అదే టైమ్ లో నా దగ్గరకు మేనేజర్ తో కబురు పంపించాడు. నాకు ప్రొడ్యూసర్లు రావడం లేదు.. ఫెయిల్యూర్ లో ఉన్నాను... విజయ్ కృష్ణ, పద్మాలయ కాంబినేషన్ లో సినిమా చేస్తే బాగుంటుంది అని కబురు పెట్టారు. అప్పుడు నేనే స్వయంగా శోభన్ బాబు ఇంటికి వెళ్లాను. సినిమా చేద్దాం.. విజయ్ కృష్ణ ప్రొడక్షన్ లో.. విజయ నిర్మల డైరెక్ట్ చేస్తుంది అని 25 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చి వచ్చాను. '' అని కృష్ణ అన్నారు.
కృష్ణ మాట్లాడుతూ.. ''సరిగ్గా అప్పుడే శోభన్ బాబు మల్లెపూవ్వు సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పుడు నేను మద్రాస్ నుంచి హైదరాబాద్ మార్నింగ్ ప్లైట్ కు బయలుదేరుతూ.. విజయ నిర్మలతో అన్నాను.. మల్లెపువ్వు హిట్ అయ్యింది.. ఇక శోభన్ బాబు మన సినిమా చేయడేమో అని. ఆమాట చెప్పి నేను హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను.. గెస్ట్ హౌస్ కు వెళ్లే సరికి విజయ నిర్మల నుంచి ఫోన్ వచ్చింది..
శోభన్ బాబు మన సినిమా చేయను అన్నాడు. కథలో మార్పుల కోసం పంపిస్తే.. ఆ కథ నాకు నచ్చలేదు.. నేను చేయడంలేదు.. ఈ అడ్వాన్స్ కృష్ణగారికి ఇచ్చేయండి అని డబ్బలు వెనక్కి పంపించాడు. నేను నిర్మలతో అన్నాను.. అతనికంటే పెద్ద హీరోతో ఈ సినిమా చేద్దాం.. సాయంత్రానికి ఏదో ఒకటి తేల్చేద్దాం అని నేను వెంటనే నాగేశ్వరావు దగ్గరకు వెళ్లాను. అని కృష్ణ అన్నారు.
అప్పటికే నాగేశ్వరరావుతో కృష్ణకు దేవదాసు సినిమా వివాదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. అయినా సరే కృష్ణ రావడంతో.. ఆశ్చర్యపోయిన అక్కినేని.. ఏమిటోయ్ ఇలా వచ్చావ్ అని అడిగాడట. దానికి కృష్ణ సమాధానం చెపుతూ.. '' ఏం లేదు.. మీతో సినిమా చేద్దాం అని వచ్చాను.. నాతో నువ్వు సినిమా చేస్తా.. సరే మన పాత గొడవలు మర్చిపోయి.. ఫ్రెండ్లీగా, జ్యోవియల్ గా , హ్యాపీగా మాట్లాడుకుందాం.. దీనికి ఒకే అంటే.. నేను యాక్ట్ చేస్తాను.. కానీ కథ నాకు నచ్చాలి అని అక్కినేని అన్నారు.
అప్పుడు నేను శోభన్ బాబుతో చేయాలి అనుకున్న కథను క్యాన్సిల్ చేసి.. హిందీలో అమితాబ్ చేసిన డాన్ సినిమా కథను మార్పించి.. నా పాత్ర, విజయ నిర్మాల పాత్ర యాడ్ చేసి.. హేమా హేమిలు సినిమా చేశాం. కథ ఆయనకు నచ్చింది. సినిమా కోసం బాగా కోఆపరేట్ చేశారు కూడా'' కృష్ణ అన్నారు.
కృష్ణ తో సినిమాను క్యాన్సల్ చేసిన వారం రోజుల్లోనే అక్కినేనితో ఆయన సెట్స్ మీదకు వెళ్లడంతో.. శోభన్ బాబు షాక్ అయ్యారు. అదేంటి ఇంత త్వరగా నాగేశ్వరరావు గారు ఒప్పుకోవడం సినిమా స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయిందిగా అంటూ శోభన్ బాబు షాక్ అయ్యారట. అంతే కాదు నిర్మాత రామానాయుడు కూడా ఈ విషయం నమ్మలేకపోయారు. కారంచేడులో ఉన్న ఆయన పేపర్ లో విషయం చూసి.. నిజంగా ఇది నమ్మలేకపోతున్నా అని అన్నారట. ఇలా కృష్ణ శోభన్ బాబుకు సాయం చేద్దాం మని వెళ్తే.. ఆయన చేసిన పని వల్ల.. అక్కినేనితో హేమా హేమీలు మూవీ చేయాల్సి వచ్చింది.