చిరంజీవికి రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఎప్పుడు మొదలైంది అనే విషయంపై లెజెండ్రీ డైరెక్టర్ ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో దర్శకుడు అయితే అసలు రాజకీయాలు వద్దు అని చిరంజీవికి చెప్పారట.
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని రారాజుగా వెలుగొందారు. ఎన్టీఆర్ తర్వాత అభిమానుల్లో అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం చిరంజీవికి మాత్రమే సాధ్యం అయింది. 90వ దశకంలో చిరంజీవి క్రేజ్ పీక్ కి చేరుకుంది. ఆ టైంలో చిరంజీవి ప్రభంజనం ముందు మరే ఇతర హీరో నిలబడలేకపోయారు.
25
ప్రజారాజ్యం పార్టీ
అయితే చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి 2008లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం అప్పట్లో పెను సంచలనం. అయితే చిరంజీవి రాజకీయాల్లో ఆశించిన విజయం సాధించలేదు. రాజకీయాలకు స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
35
ఆ మూవీ సమయంలోనే..
అసలు రాజకీయాల్లోకి రావాలనే కోరిక చిరంజీవికి ఎప్పుడు కలిగింది అనే సందేహం అందరిలో ఉంది. దీని గురించి లెజెండ్రీ డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం పంచుకున్నారు. చిరంజీవి గారికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మొదలయింది ముఠామేస్త్రి చిత్రం సమయంలోనే అని అన్నారు.
ఎందుకంటే అది పొలిటికల్ రిలేటెడ్ మూవీ. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చిరంజీవి ఇక రాజకీయాల్లోకి రావాలి అని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. కానీ ఆయన అంత వేగంగా నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి 2008లో ఎంట్రీ ఇచ్చారు. సొంత పార్టీ పెట్టి 18 సీట్లు సాధించడం, కేంద్ర మంత్రి కావడం మంచి విజయమే అని కోదండ రామిరెడ్డి అన్నారు.
55
అసలు రాజకీయాల్లోకి వద్దు అని చెప్పిన దర్శకుడు
మరో దర్శకుడు కోడి రామకృష్ణ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు వెళ్ళొద్దని తాను రిక్వస్ట్ చేసినట్లు కోడి రామకృష్ణ పేర్కొన్నారు. ఒక వేళ వెళ్లడం తప్పనిసరి అయితే సినిమాలని మాత్రం వదిలిపెట్టొద్దు అని చెప్పాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లో చేయాల్సిన గొప్ప పాత్రలు ఇంకా ఉన్నాయి అని కోడి రామకృష్ణ అన్నారు. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు మొట్టమొదట నేనే అభినందించా అని అన్నారు.