సినిమాల్లో కలిసి నటిస్తున్న సమయంలో జెమినీ గణేశన్, పుష్పావల్లికి దగ్గరయ్యారు. పెళ్లి కాకుండానే పుష్పావల్లి, జెమినీకి ఇద్దరు కూతుళ్లు - రేఖ, రాధాలకు తల్లి అయింది. జెమినీ ఎప్పుడూ పుష్పావల్లిని భార్యగా గుర్తించలేదు. ఆ తర్వాత జెమినీకి మన అమ్మాయి సావిత్రి పరిచయమైంది.
ఆమె నటి అవ్వాలనుకుంది. జెమినీ సావిత్రికి సహాయం చేశారు. కలిసి పనిచేసే సమయంలో ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. సావిత్రిని పెళ్లి చేసుకున్న తర్వాత జెమినీ రేఖ తల్లికి దూరంగా ఉన్నారు. తన కూతుళ్లను కూడా గుర్తుపట్టడానికి నిరాకరించేవారు.