రామ్‌చరణ్‌- శంకర్‌ సినిమాకి కియారా అద్వానీకి ఎంత రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారో తెలుసా? మామూలుగా లేదుగా!

First Published Aug 8, 2021, 9:17 PM IST

కియారా అద్వానీ బాలీవుడ్‌లో జోరుమీదుంది. ఆమె క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ జోరుని సౌత్‌లో చూపించబోతుంది. మరోసారి ఆమె సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. రామ్‌చరణ్‌-శంకర్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. 
 

రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో `ఆర్‌సీ15`పేరుతో పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతుంది. శంకర్‌ సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దాని రేంజే వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 

ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా కాస్టింగ్‌ అండ్‌ క్రూ ఎంపిక జరుగుతుంది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానిని ఎంపిక చేశారు. 
 

ఇప్పటికే కియారా తెలుగులో మహేష్‌తో `భరత్‌ అనే నేను`, రామ్‌చరణ్‌తో `వినయ విధేయ రామ` చిత్రంలో నటించింది. మరోసారి చరణ్‌తో రొమాన్స్ చేయబోతుందీ యంగ్‌ బ్యూటీ. దీంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. 

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి కియారా తీసుకోబోతున్న రెమ్యూనరేషన్‌ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ పాన్‌ ఇండియా చిత్రానికిగానూ కియారాకి ఏకంగా నాలుగు కోట్లు ఇస్తున్నారని టాక్‌. తెలుగులో సమంత, పూజాహెగ్డేలకు, సౌత్‌ ఎంట్రీ ఇచ్చిన అలియా భట్‌కి మాత్రమే ఈ స్థాయి పారితోషికం అందిస్తున్నారు. అలాగే సౌత్‌లో నయనతార ఇంతటి రెమ్యూనరేషన్‌ అందుకుంటోంది. వారి సరసన ఇప్పుడు కియారా చేరిందని చెప్పొచ్చు. అయితే మొదట కియారా ఐదు కోట్లు డిమాండ్‌ చేసిందట. చివరికి నాలుగు కోట్లకి ఒప్పించారనే వార్త వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్‌ సినిమా `షేర్షా` ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ఫోటో షూట్‌కి పోజులిచ్చింది కియారా. ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

అయితే ఈ ప్రమోషన్‌లో పాల్గొన్న కియారా నల్ల రంగు బ్రాలెట్‌, స్కర్ట్‌లో మెరిశారు. ఆ డ్రెస్‌ ధర హాట్‌ టాపిక్‌గా మారింది. దీనికి ఏకంగా రూ.79.500 ఖర్చు చేశారట. స్పెషల్‌గా దీన్నిడిజైన్‌ చేసినట్టు సమాచారం. 

click me!