ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ఖుష్బూ, డైరెక్టర్ సుందర్ సిని పెళ్లి చేసుకున్నారు. వీరికి అవంతిక, అనందిత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు వీరిద్దరూ చాలా బొద్దుగా ఉండేవారు. దాంతో చాలామంది వాళ్లను ట్రోల్ చేశారు. కానీ కరోనా లాక్డౌన్లో వాళ్ల అమ్మతో పాటు వర్కౌట్లు చేసి బరువు తగ్గి స్లిమ్గా మారారు.
26
సినిమాల్లోకి ఖుష్బూ కూతుళ్లు
బరువు తగ్గాక ఖుష్బూ ఇద్దరు కూతుళ్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్న కూతురు అనందిత 'డబుల్ ఆక్యుపెన్సీ' సినిమాతో నిర్మాతగా మారింది. పెద్ద కూతురు అవంతిక 'అటాకర్' సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇందులో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది.
36
ఖుష్బూ కూతురి పెళ్లి
ఇప్పుడు ఖుష్బూ తన పెద్ద కూతురు అవంతికకు పెళ్లి ఫిక్స్ చేసింది. ఈ పెళ్లి వేడుక గోవాలో జరగనుంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు చాలామంది సినీ ప్రముఖులు గోవాకు వెళ్తున్నారు. అక్కడ ఓ స్టార్ హోటల్లో ఖుష్బూ వీళ్లందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తోంది. ఆ సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఖుష్బూ కూతురి పెళ్లికి టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా హాజరయ్యారు. ఆయన తన భార్య అమలతో కలిసి గోవా వెళ్లారు. అక్కడ నాగార్జునతో ఖుష్బూ సరదాగా మాట్లాడుతున్న అందమైన క్షణం ఇది. ఖుష్బూ, నాగార్జున ఇద్దరూ కెప్టెన్ నాగార్జున్, కిరాయి దాదా చిత్రాల్లో నటించారు.
56
పెళ్లి వేడుకలో ఖుష్బూ బెస్ట్ ఫ్రెండ్స్
ఈ పెళ్లి వేడుకలో ఖుష్బూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నటీమణులు పూర్ణిమ భాగ్యరాజ్, సరిత, డ్యాన్స్ మాస్టర్ బృంద కూడా పాల్గొన్నారు. అలాగే డైరెక్టర్ భాగ్యరాజ్ తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.
66
ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
వీళ్లతో పాటు నటి త్రిష కూడా ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు గోవా వెళ్లినట్లు సమాచారం. అలాగే నటుడు రవి మోహన్ మాజీ భార్య ఆర్తి కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. శ్రవణ్ - అవంతికల వివాహం నేడు జరగనుంది.