ఈ విషయంపై ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ, `మేము ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశాం. నా భర్త సుందర్ సి, నేను ఇద్దరం కలిసి మా కుమార్తె, శ్రవణ్ శ్రీనివాసన్ పెళ్లికి ఆహ్వానించాం. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మాకు సమయం కేటాయించి, కాబోయే కొత్త జంటను ఎంతో ప్రేమగా ఆశీర్వదించారు. మాకు సమయం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది` అని ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు.