మొదటి భాగంలో అనంత నాగ్ కథ చెబుతుంటాడు. ఈ సెకండ్ పార్ట్ లో ఆయన కుమారుడైన ప్రకాష్ రాజ్ స్టోరీ నెరేట్ చేస్తుంటాడు. కానీ యష్, సంజయ్దత్ ఇద్దరే సినిమాని నడిపిస్తారని, వారిద్దరి చుట్టూతే ప్రధానంగా సాగుతుందని, ఇద్దరూ ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంటారని పోస్ట్ పెడుతున్నారు. ఫస్టాఫ్ ఫుల్ యాక్షన్తో సాగుతుందని, ద్వితీయార్థం ఎమోషనల్గా, మదర్ సెంటిమెంట్తో ఇంటెన్స్ గా సాగుతుందట. క్లైమాక్స్ ఊహించని విధంగా, గూస్బంమ్స్ తెప్పించేలా ఉంటుందని టాక్.