టాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన కీర్తి సురేశ్, రీసెంట్ గా వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బాలనటిగా తన ప్రయాణాన్ని మలయాళ సినిమాలతో స్టార్ట్ చేసిన కీర్తి, 2015లో తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది తెలుగులో నేను శైలజ సినిమాతో పరిచయమై, 2018లో మహానటి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆమెకు జాతీయ ఉత్తమ నటీ అవార్డు ను అందించింది.