
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో సుమిత్ర ఆపరేషన్ గురించి ఆరా తీస్తుంది పారు. నువ్వు అసలైన వారసురాలివి కానప్పుడు సుమిత్రకు ఆపరేషన్ ఎలా జరిగింది? నీ బోన్ మ్యారో ఎలా ఇచ్చావ్? మళ్లీ నాకు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? అసలు నువ్వు దాసు కూతురివా? సుమిత్ర కూతురివా? అని జ్యోత్స్నను అడుగుతుంది పారు. సుమిత్రకు కన్న కూతురే బోన్ మ్యారో ఇచ్చింది అంటుంది జ్యోత్స్న. మళ్లీ కన్ఫ్యూజ్ అవుతుంది పారు. ఎక్కడో ఉన్న కన్న కూతురు ఎలా బోన్ మ్యారో ఇచ్చింది? అని అడుగుతుంది పారు.
తల్లికి కూతురు ఎవరో తెలియకపోవచ్చు. కానీ ఆ కూతురికి.. కన్న తల్లి ఎవరో తెలుసు అంటుంది జ్యోత్స్న. షాక్ అవుతుంది పారు. తను ఎవరో నీకు తెలుసా? అని జ్యోత్స్నను అడుగుతుంది పారు. తెలుసని షాక్ ఇస్తుంది జ్యోత్స్న. అసలైన వారసురాలు ఎవరో చెప్పు అని జ్యోను అడుగుతుంది పారు. తెలుసుకొని ఏం చేస్తావ్ అంటుంది జ్యోత్స్న. చిన్నప్పుడు వదిలేసిన ప్రాణాలు ఇప్పుడు తీస్తాను. శివన్నారాయణ మనుమరాలు ఎవరో చెప్పు అని గట్టిగా అరుస్తుంది పారు.
అదే టైంలో కిచెన్ లో వాటర్ తాగుతున్న దీపకు పొలమారుతుంది. కార్తీక్ వచ్చి ఎవరో నిన్ను గట్టిగానే తలుచుకుంటున్నారు మరదలా అంటాడు. పారిజాతం గారే కావచ్చు. నేను తన మనుమరాలు కాదన్న విషయం తెలిసిపోయిందేమో అని డౌట్ పడుతుంది దీప. తనకు తెలిసే ప్రసక్తే లేదు అని కొట్టి పారేస్తాడు కార్తీక్.
మరోవైపు అసలైన వారసురాలు ఎవరో చెప్పు అంటుంది పారు. చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ మనుమరాలు.. సుమిత్ర, దశరథలా కన్న కూతురు, ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో కాదు.. ఆ దీపే అంటుంది జ్యోత్స్న. పారు గుండె పట్టుకుంటుంది. నిన్ను నేను ఎలా నమ్మాలి? అని అడుగుతుంది పారు. వెంటనే తాను అంతకుముందు చేయించిన డీఎన్ఏ రిపోర్ట్స్ చూపిస్తుంది జ్యోత్స్న. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్లు ఆడుతున్నారు. నేనే మహానటి అనుకున్నాను. కానీ ఇక్కడ నన్ను మించిన నటులున్నారు. నిజం తెలిసిందిగా ఒక్కొక్కరిని తొక్కిపట్టి నార తీస్తానని ఆవేశపడుతుంది పారు.
ఇప్పుడు నువ్వు బయటపడితే నష్టం మనకే. అందరికి దీప గురించి నిజం తెలిసేలోపు ఈ ఆస్తి నా పేరు మీద రాసుకోవాలి. బావను పెళ్లి చేసుకోవాలి అంటుంది జ్యోత్స్న. వాడెందుకే నీకు? కార్తీక్ ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వదిలేయ్ అంటుంది పారు. ఆస్తి మనది కావాలంటే, నీకు ఏ నిజం తెలియనట్లే ఉండు. వాళ్లతో మంచిగా ఉంటూనే మన పని మనం చేద్దాం అని అంటుంది జ్యోత్స్న. నేను రెడీ అని చేతులు కలుపుతుంది పారు.
మరోవైపు హాల్లో కూర్చొని దక్షిణామూర్తి మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఒక కాల్ వస్తుంది. శివన్నారాయణ కోపంగా మాట్లాడుతాడు. ఆ మాటలకు అందరూ కిందకు వస్తారు. దశరథ ఏమైంది నాన్న అని అడిగితే.. నెల్లూరు బ్రాంచ్ లో పెద్ద ఫ్రాడ్ జరిగిందట.. ఫోన్ వచ్చిందని చెప్తాడు శివన్నారాయణ. సరే నేను వెళ్తాను మీరు రేపు బోర్డ్ మీటింగ్ చూసుకోండని చెప్పి వెళ్తాడు దశరథ. దీపకు జ్యోత్స్నపై అనుమానం వస్తుంది.
పారు, దీపను అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఏమైంది పారు ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు కార్తీక్. మీరిద్దరూ చాలా కొత్తగా కనిపిస్తున్నారు అంటుంది పారు. నువ్వు కూడా అలాగే కనిపిస్తున్నావు అంటాడు కార్తీక్. నేను ఓ పిచ్చి మాలోకాన్ని. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాను. నేనేమి కొత్తగా లేను అంటుంది పారు. సరే మేము ఇంటికి వెళ్తున్నామని చెప్పి బయల్దేరుతారు కార్తీక్, దీప.
నెల్లూరు బ్రాంచ్ లో జ్యోత్స్ననే ఏదో కుట్ర చేసినట్లు ఉంది బావ అంటుంది దీప. లేదు సమస్య నిజంగానే ఉంది అంటాడు కార్తీక్. పారిజాతం గారు కూడా ఏదో తేడాగా ఉన్నారు అని అనుమానపడుతుంది దీప. లైట్ తీసుకుంటాడు కార్తీక్.
మరోవైపు శౌర్యను చదివిస్తూ ఉంటుంది కాంచన. అంతలో కార్తీక్, దీప వస్తారు. కాసేపు మాట్లాడుకుంటారు. అమ్మా.. నీకు అత్త వాళ్ల నాన్న దక్షిణమూర్తి గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు కార్తీక్. ఉలిక్కిపడి చేతులో గ్లాస్ కింద పడేస్తుంది కాంచన. ఆ పేరు నీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అని అడుగుతుంది కాంచన. ఆయన ఈ రోజు ఇంటికి వచ్చాడని చెప్తాడు కార్తీక్. మా నాన్న ఇంట్లోకి రానిచ్చారా అంటుంది కాంచన. ఆ తాత గురించి అడిగితే ఎందుకు ఎవ్వరూ చెప్పట్లేదు అంటుంది దీప. ఎవరే నీకు తాత అని కోప్పడుతుంది కాంచన.
మన దృష్టిలో ఆ కుటుంబం ఎప్పుడో చచ్చిపోయింది. వాళ్ల దృష్టిలో మన కుటుంబం చచ్చిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ మనిషి ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేద అంటుంది కాంచన. వాళ్లకు, మనకు గొడవేంటి అని అడుగుతాడు కార్తీక్. వాళ్ల గురించి మరోసారి అడిగితే నేను చచ్చినంత ఒట్టే అంటుంది కాంచన. షాక్ అవుతారు దీప, కార్తీక్. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.