Karthika Deepam: సౌందర్యను చూసి కుమిలిపోతున్న కార్తీక్.. చంద్రుడిపై సీరియస్ అయిన సౌందర్య?

First Published Dec 20, 2022, 7:56 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు డిసెంబర్ 20 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్ లో చారుశీల చుట్టూ చూస్తూ కార్తీక్ ఎక్కడ ఉన్నావు అనుకుంటూ పక్కకి చూడగా అక్కడే కార్తీక్ ఉండడంతో సంతోషపడుతుంది. అప్పుడు కార్తీక్ సౌందర్య వైపు చూస్తూ ఎంత చిన్నగా అయిపోయావు మమ్మీ అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు చారుశీల ఇప్పుడు చెప్పండి అది మనవరాలు గురించి మాట్లాడాలి అన్నారు కదా అని అంటుంది. నేను ఆ నెంబర్ కి మళ్ళీ కాల్ చేశాను కానీ పని చేయడం లేదు అయినా నా మనవరాలు నాకు తిరిగి ఇవ్వడం వాళ్లకి ఇష్టం లేదు అందుకే రాంగ్ నెంబర్ ఇచ్చారు. నా మనవరాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకు ఏమైనా చెప్పారా అని అడగగా లేదండి అని అంటుంది.
 

అప్పుడు సౌందర్య చారుశీలని రిక్వెస్ట్ చేస్తూ చెప్పమ్మా ప్లీజ్ నా మనవరాలు కనిపిస్తే నేను హైదరాబాద్ కి తీసుకెళ్తాను వాళ్ళ అమ్మానాన్న కోసం వెతికి వెతికి పిచ్చిదవుతోంది అని బాధగా మాట్లాడుతుంది. అప్పుడు కార్తీక్ దూరం నుంచి సౌందర్యను చూస్తూ ఎలా ఉండే దానివి మమ్మీ ఏదైనా కానీ ఆర్డర్ వేసే దానివి అలాంటిది మా కోసం ఇలా రోడ్డుపై తిరుగుతూ అందరిని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మేము నా మనవరాలు తీసుకెళ్తానేమో అని వాడు ప్రతిసారి ఇంటి అడ్రస్ మార్చేస్తున్నాడు. అందుకే నేను నిన్ను ఇంతలా బ్రతిమలాడుతున్నాను చెప్పమ్మా ప్లీజ్ అని అంటుంది సౌందర్య. నాకు అడ్రస్ తెలుసు మా డ్రైవర్ని పంపించి రేపు పాపని హాస్పిటల్ కి పిలుచుకొని రమ్మని చెబుతాను.
 

మీరు కూడా హాస్పిటల్ కి రండి పావని పిలుచుకుని వెళ్తారు అనడంతో చాలా థాంక్స్ అమ్మ నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అంటుంది సౌందర్య. సౌందర్య వెళ్ళిపోతుండగా కార్తీక్ ఇంకొద్దిసేపు సౌందర్యని చూడాలి అనుకున్న సౌర్య చారుశీల కావాలనే సౌందర్యని వెనక్కి పిలిచి సౌర్య గురించి అడిగి మాటల్లో పెడుతుంది. అప్పుడు సౌందర్య తన గతం మొత్తం చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉండగా దూరం నుంచి కార్తీక్ అది చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత సౌందర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి రావడంతో మీ అమ్మ గారిని చూసావా అని అడగగా చూసాను మొదటిసారి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను. కాదు నేనే ఏడిపించాను అని బాధపడతాడు. చూసావు కదా మా అమ్మకి దీప అంటే ఎంత ప్రేమనో అందుకే నేను మా మమ్మీకి నిజం చెప్పాలనుకోవడం లేదు.
 

నిజం చెప్తే మా మమ్మీ చాలా బాధపడుతుంది అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి మొదటి దీప ఆరోగ్యం గురించి ఆలోచిద్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది దీప ఒక్కతే ఉంటుంది ఇంటికి వెళ్లి కార్తీక్ అని చారుశీల అక్కడి నుంచి పంపించేస్తుంది. మరుసటి రోజు ఉదయం చంద్రమ్మ, ఇంద్రుడు ఇద్దరు సూర్య గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు చంద్రుడు జ్వాలమ్మ మన దగ్గర నుంచి వెళ్లిపోయే సమయం దగ్గర పడింది అనడంతో చంద్రమ్మ సీరియస్ అవుతుంది. కార్తీక్ సార్ ఇక్కడే ఉంచమని చెప్పారు కదా మరి ఎలా ఎందుకు మాట్లాడుతున్నావు గండ అనగా ఏమో ఆ సమస్య పరిష్కారం అయితే వెళ్లిపోవచ్చమో అని అంటాడు ఇంద్రుడు.
 

అప్పుడు వాళ్లిద్దరూ సౌర్య గురించి వాదించుకుంటూ ఉండగా ఇంతలోని సౌర్య అక్కడికి వస్తుంది. ఇంతలోనే సౌర్య అక్కడికి వచ్చి చారుశీల మేడం రమ్మని చెబుతోంది అనగా ఎందుకు అనడంతో హాస్పిటల్లో పోస్టర్ అతికించాను కదా అమ్మానాన్నలు వచ్చారు అనుకుంటా అందుకే రమ్మని చెప్పింది అని అనగా చంద్రమ్మ దంపతులు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు ఇంద్రుడు వాళ్ళు మేము కూడా వస్తాం అనగా మీరు ఎందుకు బాబాయ్ నన్ను ఒక్కదాని రమ్మని చెప్పి కారు కూడా పంపించింది అని అంటుంది శౌర్య. ఆ తర్వాత ఇంద్రుడు వాళ్ళందరూ కలసి హాస్పిటల్ కి బయలుదేరుతార. మరొకవైపు దీప శౌర్య ఫోటో చూస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి రావడంతో వీళ్ళు ఎంత దుర్మార్గులో కదా డాక్టర్ బాబు మన పాపని వాళ్ళ దగ్గర ఉంచుకొని కూడా ఇవ్వకుండా నాటకాలు ఆడుతూ తప్పించుకు తిరుగుతున్నారు అని అంటుంది దీప.

 అప్పుడు కార్తీక్ అవన్నీ ఆలోచించకు మొదట టాబ్లెట్ వేసుకోవాలని దీప తో టాబ్లెట్స్ మింగిస్తాడు. మరొకవైపు చారుశీల సౌందర్య మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో హాస్పిటల్ కి సౌర్య వస్తుంది. అప్పుడు సౌర్య సౌందర్యని చూసి మా అమ్మ  కాదు వచ్చినది మా నాన్నమ్మ నన్ను చూస్తే తీసుకెళ్లి పోతుంది వెళ్ళిపోదాం పద అని అక్కడ నుంచి పరిగెడుతూ ఉండగా సౌందర్య వచ్చి ఆగండ్రా అని అంటుంది. అప్పుడు సౌందర్య ఇంద్రుడు కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీసి సీరియస్ అవుతుంది. అప్పుడు మేమేం తప్పు చేయలేదు అంతా పాప ఇష్టం మీదకు చేసాము అనడంతో చేసిందంతా చేసి నా మనవరాలు మీదికి నెట్టేస్తున్నారా అని సీరియస్ అవుతుంది సౌందర్య. అప్పుడు సౌర్య వాళ్ళు చెప్పేది నిజమే అనడంతో నీకు తెలియదు నువ్వు సైలెంట్ గా ఉండు వాళ్ళు కావాలనే నీ మనసు మార్చి ఇలా నాటకాలు వాడుతున్నారు అని అంటుంది.

click me!