ఎపిసోడ్ ప్రారంభంలో పోలీసుల కైనా క్రైమ్ జరిగాకే తెలుస్తుంది. అలాంటిది ఇది ఎలాంటి తప్పులు చేస్తుందో మాకెలా తెలుస్తుంది అని రాజ్ ని అడుగుతుంది రుద్రాణి. అదంతా మాకు తెలియదు బతిమాలుతారో, బుజ్జగిస్తారో తెలియదు కానీ మరొకసారి ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే అని తల్లి కొడుకులకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్. మిగిలిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా నన్నే అంటారేంటి అంటూ ఫ్రెష్టేట్ అవుతుంది రుద్రాణి.