నటి దిశా పటానీకి ఇప్పుడు 34 ఏళ్లు. కేవలం 500 రూపాయలతో ముంబైకి వచ్చిన ఆమె, ఇప్పుడు 75 కోట్ల రూపాయల ఆస్తికి యజమానురాలు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, వ్యాపారాల ద్వారా కోట్లు సంపాదిస్తోంది.
టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టి, ఇప్పుడు బాలీవుడ్లో సెటిల్ అయ్యింది దిశా పటానీ. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో మళ్లీ టాలీవుడ్కి కమ్ బ్యాక్ ఇచ్చింది. నేడు బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న దిశా పటానీ 1992 జూన్ 13న బరేలీలో పుట్టింది. ఈ రోజు గ్లామర్, ఫిట్నెస్కు మారుపేరుగా నిలిచింది. కానీ ఆమె ప్రయాణం అంత సులువుగా సాగలేదు. తన కలలను నిజం చేసుకోవడానికి ముంబైకి వచ్చినప్పుడు ఆమె దగ్గర కేవలం 500 రూపాయలు మాత్రమే ఉన్నాయట. అయినా, మోడలింగ్తో కెరీర్ మొదలుపెట్టి, తన కఠోర శ్రమతో ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకుంది. ఈ రోజు దిశా కోట్లాది రూపాయల ఆస్తికి అధిపతిగా ఎదిగింది.
24
దిశా పటానీ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా నిలిచింది. నటనతో పాటు, ఇతర మార్గాల ద్వారా కూడా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. 34 ఏళ్ల దిశా పటానీ, బాలీవుడ్లో చాలా త్వరగా పేరు తెచ్చుకుంది. ఎందరో పెద్ద స్టార్స్తో కలిసి పనిచేసింది. బాలీవుడ్లోనే కాకుండా, దక్షిణాది సినిమాల్లోనూ చురుకుగా ఉంది. కేవలం 500 రూపాయలతో ముంబైకి వచ్చిన దిశా, ఇప్పుడు తన కృషితో పెద్ద సామ్రాజ్యాన్నే నిర్మించుకుంది. దిశా మొత్తం ఆస్తి విలువ 75 కోట్ల రూపాయలు. ఆమె వార్షిక ఆదాయం సుమారు 12 కోట్ల రూపాయలు. ముంబైలోని ఖార్ వెస్ట్లో ఉన్న 'రుస్తమ్జీ పారమౌంట్'లో 6 కోట్ల విలువైన 4 BHK అపార్ట్మెంట్ ఉంది. అంతేకాకుండా, బాంద్రాలో సముద్రానికి ఎదురుగా మరో విలాసవంతమైన అపార్ట్మెంట్ కూడా ఉంది. దిశాకు కార్లంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో మెర్సిడెస్-బెంజ్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, BMW 7 సిరీస్, ఆడి A6 వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి.
34
దిశా పటానీ ఆదాయ మార్గాలు
దిశా పటానీ అనేక మార్గాల ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. ఆమెకు సినిమాలే అతిపెద్ద ఆదాయ వనరు. ఒక సినిమాలో నటించడానికి ఆమె 5 నుంచి 7 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా బాగా సంపాదిస్తుంది. ఒక యాడ్ కోసం దాదాపు 3 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుంది. ఫిట్నెస్, ఫ్యాషన్ స్టార్టప్లలో కూడా పెట్టుబడులు పెట్టింది. ఇక, తన సోషల్ మీడియా ఖాతాలో ఏదైనా బ్రాండ్ప్ ని ప్రచారం చేయడం కోసం 1 నుంచి 1.5 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఏదైనా ఈవెంట్, పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 50 నుంచి 75 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది.
దిశా పటానీ 2015లో తెలుగు యాక్షన్ డ్రామా 'లోఫర్'తో నటనలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి హిందీ చిత్రం 'ఎం.ఎస్. ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' (2016). ఆ తర్వాత చైనా యాక్షన్ కామెడీ 'కుంగ్ ఫూ యోగా' (2017) చిత్రంలో నటించింది. అనంతరం 'బాఘీ 2', 'కల్కి 2898 AD', 'కంగువా', 'మలంగ్', 'భారత్', 'బాఘీ 3', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్', 'యోధ', 'ఓ రోమియో' వంటి చిత్రాలలో కనిపించింది. అయితే, కేవలం 2-3 చిత్రాలలో మాత్రమే ఆమె ప్రధాన నాయికగా నటించింది. ఆమె రాబోయే చిత్రాలు 'వెల్కమ్ టు ది జంగల్', 'ఆవారాపన్ 2'. 'వెల్కమ్ టు ది జంగల్' సినిమా జూన్ 26న విడుదల కానుంది.