అయితే 1993లో ఆయన లాయర్గా ప్రాక్టీసింగ్ చేస్తున్న క్రమంలో వాదించిన ఓ కేసుతో పాపులర్ అయ్యారు కె. చంద్రు. వామపక్ష భావజాలం కలిగిన ఆయన పేదలకు, గిరిజనుల కోసం పనిచేశారు. పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకుల చేత పీడించబడుతున్న, బాధింపబడుతున్న పేదల కోసం ఆయన పనిచేశారు. ఈ క్రమంలో 1995లో జరిగిన కేసుతోనే `జై భీమ్` సినిమాని తెరకెక్కించారు. ఈ కేసులో ఆయన ఏకంగా ప్రభుత్వంతోనే పోరాడారు. ఆ తర్వాత అనేక కేసుల్లో ఆయన స్వచ్చంగా వాదించి న్యాయం జరిగేలా చేశారు.