జీవో రిలీజ్ అయిన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఫినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 'దేవర చిత్ర రిలీజ్ సందర్భంగా కొత్త జీవో రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సినీటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారికి నా కృతజ్ఞతలు. తెలుగు సినిమాకి మీరు మంచి సహకారం అందిస్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభినందించారు.