యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఆర్ఆర్ఆర్ త్రయం రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ ముగ్గురూ ఇండియా మొత్తం తిరుగుతూ ఆర్ఆర్ఆర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరూ జనవరి 7 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.