చిరంజీవి ఇచ్చిన అవార్డు, శోభన్ బాబు ఇంటికి పంపేసిన జూ.ఎన్టీఆర్..అంతా ఒక్కసారిగా షాక్, ఏం జరిగిందంటే

First Published Jun 30, 2024, 5:42 PM IST

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఏం చేసినా కలసి రాలేదు. అన్ని చిత్రాలు నిరాశపరుస్తూ వచ్చాయి. ఒకటి రెండు యావరేజ్ గా నిలిచాయి అంతే. మళ్ళీ రాజమౌళి వచ్చే వరకు ఎన్టీఆర్ కి హిట్ లేదు.

సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఏం చేసినా కలసి రాలేదు. అన్ని చిత్రాలు నిరాశపరుస్తూ వచ్చాయి. ఒకటి రెండు యావరేజ్ గా నిలిచాయి అంతే. మళ్ళీ రాజమౌళి వచ్చే వరకు ఎన్టీఆర్ కి హిట్ లేదు. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం యమదొంగ. 

యమదొంగ చిత్రంలో ఎన్టీఆర్ నటనతో చెలరేగిపోయాడు. రాజమౌళి లాంటి దర్శకుడు మరోసారి దొరకడంతో తారక్ తగ్గలేదు. డ్యాన్సులు, నటన ఫైట్స్ అన్ని ఇరగదీశాడు. కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ యముడి గెటప్ లో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. యమలోకంలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. 

ఈ చిత్రానికి ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ గా సినిమా అవార్డ్ దక్కింది. సినిమా అవార్డ్స్ వేడుకలో ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం విశేషం. చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 

ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు, బాబాయ్ సినిమాలు, నాగార్జున బాబాయ్ సినిమాలు చూస్తూ మేము ఎదిగాము. ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతున్న సమయంలో లెజెండ్రీ శోభన్ బాబు మరణించారు. దీనితో ఎన్టీఆర్ ఆయన గురించి ఎమోషనల్ గా ప్రసవించారు. 

Sobhan Babu

శోభన్ బాబు గారి భౌతిక కాయాన్ని దర్శించుకునే అర్హత కూడా నాకు లేదు అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ప్రసంగించారు. ఈ అవార్డుని శోభన్ బాబు గారికి అంకితం ఇవ్వాలని అనుకుంటున్నా అని ఎన్టీఆర్ తెలిపారు. ఈ అవార్డు శోభన్ బాబు గారి కుటుంబ సభ్యులకి చేరేలా మా టివి వారు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ కోరారు. ఈ పని చేయవలసిందిగా అవార్డుని చిరంజీవిగారికి అవార్డు తిరిగి ఇచేస్తునట్లు ఎన్టీఆర్ తెలిపారు. 

దీనితో ఎన్టీఆర్ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఎన్టీఆర్ సంస్కారానికి చిరంజీవి కూడా ముచ్చట పడ్డారు. తారక్ చేసిన ఈ పని అతని సంస్కారాన్ని తెలియజేస్తుంది అని చిరంజీవి వేదికపై ప్రశంసలు కురిపించారు. 

Latest Videos

click me!