పునీత్ పార్థివదేహం వద్ద కంటతడి పెట్టుకున్న ఎన్టీఆర్.. నోట మాటరాక అలాగే చూస్తూ..

First Published Oct 30, 2021, 3:08 PM IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఎనెర్జిటిక్ గా ఉండే పునీత్ మరణించడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఎనెర్జిటిక్ గా ఉండే పునీత్ మరణించడం ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. కన్నడ అభిమానులు పవర్ స్టార్, అప్పు అంటూ ముద్దుగా పిలుచుకునే పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శుక్రవారం జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురై మరణించారు. 

అభిమానులు, సెలెబ్రిటీల సందర్శనార్థం Puneeth Rajkumar పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖులు బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పునీత్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 

ఎన్టీఆర్, పునీత్ ఇద్దరూ మంచి స్నేహితులు. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ చిత్రంలో ఎన్టీఆర్ సాంగ్ పాడారు. నందమూరి ఫ్యామిలీతో రాజ్ కుమార్ కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది. 

గతంలో పునీత్.. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన నా బ్రదర్ లాంటి వారు అని తెలిపారు. పునీత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఎన్టీఆర్ ని కలసి వెళతాడు. అంతలా వీరిమధ్య బంధం ఏర్పడింది. పునీత్ మరణ వార్తతో ఎన్టీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి గురయ్యారు. 

బరువెక్కిన హృదయంతో ఎన్టీఆర్ పునీత్ కు నివాళులు అర్పించారు. పునీత్ ని అలా చూడగానే ఎన్టీఆర్ నోట మాట రాలేదు. దీనితో కన్నీరు పెట్టుకుంటూనే పునీత్ పార్థివ దేహాన్ని చూస్తూ ఉండిపోయాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ముఖంలో దుఃఖం స్పష్టంగా కనిపించింది. 

అనంతరం ఎన్టీఆర్ పునీత్ కుటుంబ సభ్యులని పరామర్శించారు. ఇదిలా ఉండగా పునీత్ అంత్యక్రియలని శనివారం సాయంత్రం నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది. కానీ విదేశాల్లో ఉన్న పునీత్ కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు రావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలని ఆదివారానికి వాయిదా వేశారు. 

click me!