పునీత్ కుటుంబ సభ్యులని పరామర్శించిన అనంతరం బాలయ్య మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీఆర్, పునీత్ తండ్రి రాజ్ కుమార్ మధ్య మంచి రిలేషన్ ఉండేది. అప్పటి నుంచే రాజ్ కుమార్, నందమూరి కుటుంబాలు సన్నిహితంగా మెలగడం ప్రారంభించాయి. ఓ కార్యక్రమంలో బాలయ్య భుజంపై దుమ్ములాంటిది పడింది. దీనితో పునీత్ తన కర్చీఫ్ తో స్వయంగా బాలయ్య బుజం తుడిచాడు. ఆ వీడియో ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.