అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సమ్మర్ వేదిక తగ్గాక త్వరలో అభిమానుల కోసం ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తానని తెలిపాడు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అయితే ఇది సినిమాకి సంబంధించిన ఈవెంట్ అని ఎన్టీఆర్ చెప్పలేదు. కేవలం ఫ్యాన్స్ కోసమే పకడ్బందీగా ప్లానింగ్ చేసి ఈవెంట్ నిర్వహిస్తానని.. తద్వారా ఫ్యాన్స్ ని కలుసుకుంటానని ఎన్టీఆర్ తెలిపారు. తమిళనాడులో రజనీకాంత్, దళపతి విజయ్ ఇదే తరహాలో సినిమాలతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని మీట్ అయ్యేందుకు మాత్రమే చిన్నపాటి ఈవెంట్స్ నిర్వహిచడం చూస్తున్నాం.